సాయి పల్లవి.... ఆమె ఒక డిఫరెంట్ హీరోయిన్.. ఒక హీరోయిన్ లా కాకుండా మనకి తెలిసిన వాళ్ల అమ్మాయి వలే ఉంటుంది సాయి పల్లవి. ఫిదా సినిమా తర్వాత.. తెలుగువారందరికీ పరిచయమైన సాయి పల్లవి కేవలం ఆ ఒక్క సినిమాతోనే ఎంతో పాపులర్ అయింది. మారి 2 లో రౌడీ బేబీ సాంగ్ కు సూపర్ గా డాన్స్ స్టెప్పులు వేసి... అంతటి మహా ప్రసిద్ధిగాంచిన డాన్స్ మాస్టర్ ప్రభుదేవానే ఆశ్చర్యపరిచింది సాయి పల్లవి. ఇలా తన తీయటి, స్వచ్ఛమైన నటనతో, సూపర్ స్టెప్పులతో అందర్నీ కట్టిపడేస్తుంది సాయి పల్లవి. ఇక స్క్రీన్ సమయాన్ని పక్కనపెడితే వ్యక్తిగత జీవితంలో కూడా సాయి పల్లవి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది.

ఆమె షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు... ఇంకా వేరే ప్రొడక్ట్స్ ని ప్రమోట్ అస్సలు చేయదని అందరికి విదితమే. ఇటీవల ఓ ఫెయిర్నెస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు 2 కోట్లా ఆఫర్ ఇచ్చి.. తనని యాడ్ చేయమని అడిగినప్పుడు... సాయి పల్లవి.... ఏం చెప్పిందంటే... "నాకు ఆ పాపపు డబ్బులు ఏం అవసరం లేదు. ఏం నేను బతకలేనా? ఇంటికి వెళితే నేను తినేది కేవలం మూడు చపాతీలు లేకపోతే కొంచెం అన్నం. అంతకు మించి నాకు పెద్ద కోరికలు ఏం లేవు. ఒకవేళ సినీరంగంలో నేను బతకలేకపోతే.. నేను డాక్టర్ చదువుకున్నాను కాబట్టి చక్కగా వైద్యం చేసుకుంటాను. క్యాన్సర్ కారకాలు ఉండే ఈ ఫెయిర్నెస్ క్రీములు జనాలకు అంట కట్టడానికి నేను ఉపయోగపడితే నాకు పాపం తగలదా? మన చర్మం, మన నేటివిటీని మనం ఒప్పుకోవాలి. అయినా ఇలాంటి ఫెయిర్నెస్ క్రీములు వలన ఎవరు తెల్లబడరు" అంటూ రెండు కోట్ల ఆఫర్ ని తిరస్కరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అలాగే ఇంకొక బట్టల షాపు ఒక కోటి ఆఫర్ ఇచ్చి ఆ షాపు బట్టలు తొడుక్కుని ఒక వీడియో తీయమంటే.. దానికి కూడా ససేమిరా అన్నది ఈ తెలుగమ్మాయి. నాకు ఇలాంటి కమర్షియల్ యాక్టివిటీ నచ్చదంటూ.. తిరస్కరించి....
.అందరిని 'వావ్' అనిపించింది.

ఇక ఇప్పటి విషయానికొస్తే... ఆమె రీసెంట్ సినిమాలు అంతగా విజయవంతం కానప్పటికీ.. కోటి రూపాయలకు పైగా ఆఫర్లు ఇస్తామంటూ ఆమె కోసం సినిమా అవకాశాలు తన్నుకొస్తున్నాయి. కొంతకాలం క్రితం డియర్ కామ్రేడ్, ఇటీవల సరిలేరు నీకెవ్వరు వంటి సినిమా ఆఫర్లను కూడా తిరస్కరించింది ఈమె. ఎందుకంటే? సింపుల్! ఆమెకు లిప్ లాక్, హాట్ సన్నివేశాల్లో నటించడం అస్సలు నచ్చదు. స్క్రిప్ట్ డిమాండ్ చేసిన ఆమె అలాంటి సన్నివేశాలు చెయ్యనని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఆమె నటించిన పడి పడి లేచే మనసు సినీ నిర్మాత ఆమెకు 40 లక్షల పారితోషికం ఇవ్వాలి. ఆ సినిమా విజయం సాధించకపోవడంతో.. సాయి పల్లవి నాకేం వద్దులే ఆ 40 లక్షలు అని చెప్పేసింది. అలాంటి మంచి మనసు సాయి పల్లవిది.

ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక నక్సలైట్ గా నాగచైతన్య సరసన నటిస్తుంది. డబ్బు కోసం హీరోలు హీరోయిన్లు చెడ్డ పానీయాలను యదేచ్ఛగా ప్రచారం చేస్తున్న ఈ రోజుల్లో... గంజాయి వనాల్లో తులసి మొక్క లాగా ఉన్న మన తెలుగు అమ్మాయి... ఇప్పటిలాగే ఎప్పటికి ఉండాలని ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: