వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాబోయే సంక్రాంతికి జనవరి 11 వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలయి సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్ టైనర్ జోనర్ లో తెరకెక్కినటు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. ముఖ్యంగా భరత్ అనే నేను, మహర్షి లాంటి రెండు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్లు వరుసగా రావటంతో మంచి జోష్ మీద ఉన్న మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ తనకి బాక్సాఫీస్ దగ్గర పడాలని సినిమాలో బాగా కష్ట పడినట్లు సినిమా యూనిట్ కి చెందిన వాళ్లు చెబుతున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ సరిగ్గా స్టార్ట్ చేయటం లేదని విమర్శలు వస్తున్న క్రమంలో టీజర్ తో అభిమానులకు మంచి దాహం తీర్చాడు మహేష్. నవంబర్ 22 వ తారీకున సాయంత్రం విడుదల అయినా ఈ సినిమా టీజర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. అతి తక్కువ సమయంలోనే 10 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకొని యూట్యూబ్ లో నెంబర్ 1 గా ట్రెండ్ సెట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా 24 గంటల్లోనే 18 మిలియన్ వ్యూస్ సాధించి టాప్ వన్ లో ట్రేండింగ్ లో ఉంది.

 

ముఖ్యంగా మహేష్ అభిమానులు మరియు క్లాస్ మాస్ అభిమానులను సినిమా టీజర్ బాగా ఆకర్షించడంతో సోషల్ మీడియాలో దుమ్ము దులిపే రికార్డులు సృష్టిస్తూ...రికార్డులను సృష్టించడంలో మన దగ్గర బేరం ఉండవమ్మా అన్నట్టుగా మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ట్రేండింగ్ లో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంక్రాంతికి అప్పుడే మహేష్ బ్లాక్ బస్టర్ కొట్టినట్లు ప్రస్తుత వాతావరణం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: