ఇన్నాళ్లూ మెగాఫోన్ పట్టిన డైరెక్టర్ యాక్టర్ అవుతున్నాడు. సినీరంగంలో ఇలా డైరెక్టర్లు యాక్టర్లు గానూ.. యాక్టర్లు డైరెక్టర్లు గానూ మారిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో కొందరే సక్సస్ అయ్యారు. ఇప్పుడు అలాంటి సక్సస్ కోసం ఎదురు చూస్తున్నారు వీవీ వినాయక్. ఎలాగూ దర్శకుడిగానూ పెద్దగా సినిమాలు లేకపోవడంతో హీరోగా ట్రై చేస్తున్నారు.

 

దర్శకుడు వి.వి. వినాయక్‌ కథానాయకుడుగా మారిన సంగతి తెలిసిందే. నరసింహారావు తెరకెక్కిస్తున్న ‘సీనయ్య’ చిత్రంలో ఆయన నటిస్తున్నాడు. ఈ చిత్రంలో వినాయక్‌ సరసన కథానాయిక శ్రియ నటిస్తుందంటూ సినీ వర్గాల్లో గుసగుసలు బాగా వినిపిస్తుంది. వినాయక్‌కు భార్యగా కనిపించబోతుందట శ్రియ. అయితే ఇంకా ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

అయితే వి.వి.వినాయక్, శ్రీయల బంధం ఈనాటిది కాదు.. గతంలో వినాయక్‌ దర్శకత్వం వహించిన ‘ఠాగూర్‌’, ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రాల్లో కథానాయిక గా శ్రీయ నటించింది. ఒకప్పుడు డైరెక్షన్ చేసిన వినాయక్ ఇప్పుడు అదే హీరోయిన్ తో రోమాన్స్ చేయబోతున్నాడు. ఈ విషయం ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది. దసరా కానుకుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. అది అందరి దృష్టిని ఆకర్షించింది.

 

ఇంకా ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. సినిమా లో విలన్ ఎవరో త్వరలోనే రివీల్ చేయబోతున్నారట. మరి హీరోగా మారిన ఈ డైరెక్టర్ ఎంత వరకూ సక్సస్ అవుతాడన్నది చూడాలి. ఇక శ్రియ కూడా ఇప్పుడు పెద్దగా సినిమాలు లేవు. ఎంచక్కా పెళ్లి చేసుకుని భర్తలో లోకం చుట్టేస్తూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలు షేర్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి సక్సస్ ఇస్తుందో చూడాలి. వినాయక్ సినిమాతో శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ ధాటిగా ఆడుతుందా.. లేదా.. అన్నది వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: