‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదలైన 24 గంటలలో ఆ టీజర్ కు 18 మిలియన్ వ్యూస్ రావడం రికార్డ్ గా మారింది. అంతేకాదు ఈ టీజర్ కు లక్షల సంఖ్యలో అతి తక్కువ సమయంలో లైక్స్ రావడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు ప్రమోషన్ విషయంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ‘అల వైకుంఠపురములో’ మూవీకి ‘సరిలేరు నీకవ్వరు’ వ్యూహాత్మకంగా చెక్ పెట్టిన సంఘటన ఒకటి జరిగింది. 

ఇప్పటి వరకు ‘అల వైకుంఠపురంలో’ మూవీకి సంబంధించి విడుదలైన ‘సామజవరగమన’ ‘రాములో రాముల’ పాటలకు విపరీతమైన స్పందన రావడంతో అదే మ్యాజిక్ ను రిపీట్ చేద్దామని బన్నీ త్రివిక్రమ్ లు ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదల అయ్యేరోజునే ఆ మ్యానియాను లెక్క చేయకుండా ‘ఓ మై గాడ్ డాడీ’ పాటను విడుదల చేసారు.  అయితే ఈ పాటకు స్పందన చాల తక్కువగా ఉండటమే కాకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ మ్యానియా ముందు ఈ పాటను ఎవరు పట్టించుకోలేదు. 

దీనికితోడు ఈ ‘సరిలేరు నీకెవ్వరరు’ టీజర్ టాప్‌లో ట్రెండ్‌ అవుతోన్న టైమ్‌లో 'అల వైకుంఠపురములో' ని ఈ వీక్‌ పాట విడుదలై బన్నీని మహేష్ ముందు వెనకపడేలా చేసింది. దీనితో ఇప్పటి వరకు ప్రమోషన్ లో ముందు ఉన్న బన్నీ మూవీ మహేష్ మ్యానియాకు వెనకడుగు వేయవలసి వచ్చింది. 

ఈ పాటను రాంగ్ టైమ్ లో రిలీజ్ చేసారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ వారంతంలో ‘అల వైకుంఠపురములో’ టీజర్‌ కూడా రిలీజ్‌ చేస్తారని తెలుస్తోంది. దీనితో ఈ టీజర్ కు ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ కు మించి హిట్స్ వచ్చేలా ఇప్పటి నుంచే త్రివిక్రమ్ మహేష్ లు చాల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: