రానా దగ్గుబాటి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనలోని అన్ని కోణాలను చూపిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'లో విలన్‌గా నటించి మెప్పించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. హీరోగా, విలన్‌గా ఫుల్ సక్సెస్ అయిన రానా  నిర్మాతగానూ సక్సెస్ అవ్వాలని భావిస్తున్నాడు. ఇందుకోసం సమంతను ముంబై తీసుకెళ్తున్నాడని ఓ వార్త బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.

 

 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం ‘ఓ బేబి'. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇందులో సమంత, సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ నటనకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. అంచనాలు లేకుండా వచ్చినా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లోకి రీమేక్ చేసేందుకు ఎంతో మంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్‌లోకి రీమేక్ చేయబోతున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన సురేష్ ప్రొడక్షన్స్ దీన్ని హిందీలోకి తీసుకెళ్లబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది. 

Image

 

 ఇప్పటికే ఈ రీమేక్ సంబంధించిన చర్చలు జరిపేందుకు రానా రంగంలోకి దిగాడని ఫిలింనగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేసింది. ఇందుకోసమే అతడు ముంబైలో తరచూ పర్యటించేవాడని అన్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా భట్‌తో రహస్య చర్చలు  దగ్గుబాటి రానా చర్చలు జరుపుతున్నాడని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయంలో ఆలియా నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది అన్న విషయం మాత్రం తెలియలేదు. 

 

ప్రస్తుతం సమంత ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ కోసం ముంబై వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం రానాతో కలిసి ఆమె అక్కడకు వెళ్లబోతుందట. అయితే, రానా వెళ్లేది మాత్రం ‘ఓ బేబీ' రీమేక్ కోసం అని తెలుస్తోంది. సమంత నటించిన సినిమా కావడంతో ఆమెతో కలిసి కరణ్ జోహార్‌తో పాటు పలువురు సెలెబ్రిటీలకు ఈ సినిమాను చూపించబోతున్నాడట దగ్గుబాటి రానా. 

మరింత సమాచారం తెలుసుకోండి: