వరుస విజయాల మీద మంచి జోరు మీద ఉన్న సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో జనవరి 11 వ తారీకున వస్తున్నారు. 'భరత్ అనే నేను', 'మహర్షి' లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పడటంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా వరకు కామెడీ ట్రాక్ ఎక్కువగా ఉంటున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

 

తాజాగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ నవంబర్ 22 వ తారీకున సాయంత్రం విడుదల చేయగా సోషల్ మీడియాలో ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండ్ అవుతు...సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా సినిమాలు ట్రైన్ కామెడీ ఎపిసోడ్ కలిగిన పార్ట్ సినిమాకి హైలైట్ అని...సెకండాఫ్ లో విజయశాంతి క్యారెక్టర్ అద్భుతంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి చూపించినట్లు...రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతికి సరైన క్యారెక్టర్ మహేష్ బాబు సినిమాలో దొరికినట్లు తాజాగా ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో రకరకాల కామెంట్లు వినబడుతున్నాయి. సీమ నేపథ్యంలో మహేష్ బాబు చేసే సాహసాలకు మరియు పోరాటాలకు...విజయశాంతిపై సినిమాలో వచ్చే సన్నివేశాలకు సినిమాహాల్లో కూర్చున్న ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అనే టాక్ వినపడుతుంది.

 

ఇదిలా ఉండగా ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడానికి మహేష్ బాబు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో త్వరలో మొదలు పెట్టబోయే ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా అదరగొట్టే రీతిలో మహేష్ చేయనున్నట్లు సమాచారం. మరోపక్క సినిమా టీజర్ చూసిన మహేష్ అభిమానులు...సంక్రాంతికి మరోసారి మహేష్ బాబు కాలర్ ఎగరవేయడం గ్యారెంటీ అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: