వరస పరాజయాలతో సతమతమైపోతున్న సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్.’ కూడ ఫెయిల్ అవ్వడంతో తెగించి తీసుకున్న నిర్ణయం అతడి మేనమామ చోటాకేనాయుడుకు షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బయోపిక్ ల సీజన్ నడుస్తున్న నేపధ్యంలో ఒకనాటి క్రేజీ యంగ్ హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన కొద్ది గంటలలోనే అది వైరల్ గా మారింది. 

ఉదయ్ కిరణ్ జీవితం ఆధారంగా తీసుకుని సందీప్ కిషన్ ఒక ఎన్నారై నిర్మాతతో కలిసి ఒక బయోపిక్ తీయడానికి రంగం సిద్ధం చేసినట్లు లీకులు వస్తున్నాయి. అనేక షార్ట్ ఫిలిమ్స్ చేసిన ఒక యంగ్ డైరెక్టర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తాడని లీకులు వస్తున్నాయి. 

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో సినిమాలలోకి వచ్చి క్రేజీ హీరోగా ఎదిగి ఆ తరువాత వరస ఫెయిల్యూర్ లతో నిరాశలోకి వెళ్ళిపోయి జీవితంలో అనేక విధాల నష్టపోయి చివరకు ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని ముగించుకున్న ఉదయకిరణ్ జీవితం బయోపిక్ మూవీకి పనికి వచ్చే మంచి కథ. ఈ బయోపిక్ ను ధైర్యంగా తీయగలిగితే ఈ మూవీకి విపరీతమైన ఓపెనింగ్స్ కలక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంది. 

అయితే ఉదయ్ కిరణ్ జీవితం పై బయూపిక్ మొదలు పెట్టి వాస్తవాలు తీయడం చాల కష్టమైన పని. గతంలో దర్శకుడు తేజ కూడ ఇలాంటి సాహసం చేయాలని ప్రయత్నించి ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి హెచ్చరికలు చేయడంతో తన ప్రయత్నం మానుకున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఇండస్ట్రీలో అందరితోను సన్నిహిత సంబంధాలు కొనసాగించే సినిమాటోగ్రాఫర్ చోటాకేనాయుడు తనకు అత్యంత సన్నిహితుడైన సందీప్ కిషన్ చేయబోతున్న సాహసానికి సపోర్ట్ ఇస్తాడా అన్న సందేహాలు కలగడమే కాకుండా ఈ మూవీ కూడ ప్రారంభం కాకుండానే ఆగిపోతుంది అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: