తమకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ కోసం వారి వీరాభిమానులు ఎన్నో సాహసాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వార్తలు ఎప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. తమిళనాడులో ఖుష్బూ కోసం ఒక వీరాభిమాని గుడి కడితే ఆ మధ్య ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ టైమ్ లో రామ్ వీరాభిమాని ఒకడు ఏడుకొండల మెట్లు మోకాలి పై ఎక్కి రామ్ కు విజయం కలగాలని వెంకన్నను కోరుకున్నాడు.

ఇప్పుడు ఏకంగా సమంత నాగచైతన్యలు కలకాలం బాగుండాలని వారికి పండంటి మగబిడ్డ పుట్టాలని విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన సాగర్ అనే వ్యక్తి సమంత కోసం రక్తం చిందించిన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సింహాచలం గుడి మెట్లు మోకాళ్ళ నడుచుకుంటూ వెళ్ళి రక్తం కారుతున్నా లెక్క చేయకుండా అతడు చూపించిన అభిమానానికి సంబంధించిన ఫోటోను ఏకంగా ఈ వీరాభిమాని సమంతకు షేర్ చేసాడు. 

ఈ ఫోటోను చూసిన సమంత నాగచైతన్యలు షాక్ అవ్వడమే కాకుండా ఆ అభిమాని బాగుండాలి అని కోరుకుంటూ ఆ అభిమానిని తమ వద్దకు రావలసిందిగా కోరుతూ రీ ట్విట్ చేసారు. ఈ సందర్భంగా సాగర్ చేసిన ట్విట్ వైరల్ గా మారింది. ‘నాగచైతన్య నిండునూరేళ్లు క్షేమంగా ఉండాలి. సమంత మేడం కూడా క్షేమంగా ఉండాలి. వాళ్లకు పుట్టబోయేది బాబే కావాలి. హ్యాపీ బర్త్‌డే చైతు బంగారం' అంటూ చేసిన ట్విట్ చైతూ సమంతల అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. 

ప్రస్తుతం సమంతకు రెండవ నెల అంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని సమంత ఖండించక పోవడంతో ఈ వార్తలు నిజమేనా అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. ఇదే విషయాన్ని కొంతమంది నాగార్జున దగ్గర ప్రస్తావించినప్పుడు అతడు నవ్వుతూ ఈ వార్తలు నిజం అయితే బాగుండును అని తాను కూడ భావిస్తున్నాను అంటూ కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: