సంక్రాంతికి రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని దెబ్బ తీయాలని ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలు ఇప్పటి నుంచే తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టేసాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా కొందరు ఈ మూవీ నిడివి పై ఒక సరికొత్త రూమర్ ప్రచారంలోకి తీసుకు వచ్చారు. 

మూవీ నిడివి మూడు వందల నిముషాలు దాటిపోయిందని ఈ మూవీలో అనేకమంది ప్రముఖ నటీనటులు నటిస్తున్న నేపధ్యంలో సన్నివేశాలు ఎక్కువైపోయి ఈ మూవీ నిడివి ఈ స్థాయికి చేరుకుంది అంటూ కొంతమంది ప్రచారం మొదలు పెట్టారు. మరికొందరైతే ఈ మూవీ నిడివిని ఎలా కట్ చేయాలో తెలియక అనీల్ రావిపూడి తెగ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు అంటూ కూడ ప్రచారం మొదలు పెట్టేసారు. 

ఈ గాసిప్పులు ఈమూవీ బయ్యర్లు వరకు చేరడంతో కొంతమంది బయ్యర్లు ఈమధ్య ఈ మూవీ నిర్మాతలను కలిసి మూవీ నిడివిని ఎట్టి పరిస్థితులలోను 160 నిముషాలు మించకూడదని చెప్పడమే కాకుండా అంతకు మించి నిడివి పెరిగితే తాము సంక్రాంతి సీజన్ లో ఈ మూవీకి ఎక్స్ట్ స్ట్రా షోలు వేసుకునే పరిస్థితి ఉండదు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు టాక్. దీనితో ఎలర్ట్ అయిన అనీల్ రావిపూడి నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి ఈ మూవీ నిడివిని ఎట్టి పరిస్థితులలోను 160 నిముషాలకు మించకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ముందు నుంచే ఈ మూవీ సీన్స్ చిత్రీకరణ విషయంలో నియంత్రణ పాటించిన విషయాలను అనీల్ రావిపూడిమూవీ బయ్యర్లకు తెలియచేసి దైర్యం కలిగించినట్లు టాక్. సంక్రాంతి రేస్ బన్నీ మహేష్ ల మధ్య ఇగో వార్ గా మారిన నేపధ్యంలో మహేష్ మూవీని పరోక్షంగా దెబ్బ తీయడానికి కొందరు అనుసరిస్తున్న వ్యతిరేక వ్యూహాలకు చెక్ పెట్టడానికి ఈ మూవీ నిర్మాతలు ఇప్పటి నుంచే చాల శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: