విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్, తమిళ హీరో ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'ఎన్నై నోకి పాయుమ్ తూటా'. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆర్థిక సమస్యల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా రేపు విడుదలకానుంది. వరస విజయాలతో ధనుష్ ఫుల్ ఫామ్ లో ఉండడం తో ఈ చిత్రం పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలావుంటే ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో డబ్ చేశారు.
తమిళ్ తోపాటు తెలుగులోనూ రేపు విడుదలకావాల్సి ఉండగా అనివార్యకారణాల వల్ల తెలుగు వెర్షన్ విడుదల వాయిదాపడింది. అన్ని కుదిరితే
డిసెంబర్ లో తూటా ను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. శివ సంగీతం అందించిన ఈచిత్రంలో
మెగా ఆకాష్ కథానాయికగా నటించగా శశి కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. ఈచిత్రానికి గౌతమ్ మీనన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.
ఇక ఇటీవల ధనుష్ 'అసురన్' అనే చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు.
వెట్రిమారన్ డైరెక్షన్ లో లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 70కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈఏడాది
కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు లో అగ్ర
హీరో వెంకటేష్ తో
రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల ఈ
రీమేక్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ఇక 'అసురన్'తరువాత
ధనుష్ ప్రస్తుతం దొరై సెంథిల్ కుమార్ డైరెక్షన్ లో
పటాస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రంలో పంజాబీ
బ్యూటీ మెహ్రీన్
ధనుష్ కు జోడిగా నటిస్తుండగా
టాలీవుడ్ యంగ్
హీరో నవీన్ చంద్ర విలన్ పాత్రలో కనిపించనున్నాడు.