‘డియర్ కామ్రేడ్’ పరాజయంతో ఎలర్ట్ అయిన విజయ్ దేవరకొండ తన సినిమాల ఎంపిక విషయంలో చాల జాగ్రత్తలుతీసుకోవడం మొదలు పెట్టాడు. ఈ పరిస్థితులలో ‘ఇస్మార్ట్ శంకర్’ ఘన విజయంతో అదే మ్యాజిక్ తనతో కూడ రిపీట్ చేస్తాడు అని ఆశపడి పూరీ జగన్నాథ్ తో విజయ్ మొదలు పెట్టవలసిన మూవీ ఈ నెలలో కాకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడింది అన్న వార్తలు వస్తున్నాయి. 

దీనికి కారణం మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ అంటున్నారు. వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూడ బాక్సింగ్ నేపధ్యంలో ఉంటుంది అన్న లీకులు వస్తున్న పరిస్థితులలో తనతో పూరీ జగన్నాథ్ తీయబోతున్న కథను పూర్తిగా మార్చవలసిందిగా విజయ్ కోరినట్లు తెలుస్తోంది. 

అయితే ఇప్పటికే పూర్తిగా తయారు కాబడ్డ ఈ మూవీ స్క్రిప్ట్ లో మార్పులు చేయడం పక్కకు పెట్టి ముందుగా అనుకున్న విధంగా డిసెంబర్ లో ఈ మూవీ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టి మధ్యలో వచ్చే టైమ్ గ్యాప్ లో ఈ మూవీ స్క్రిప్ట్ లో మార్పులు చేద్దామని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ మటుకు ఈ మూవీ స్క్రిప్ట్ లో పూర్తిగా మార్పులు చేసిన తరువాత మాత్రమే ఈ మూవీ షూటింగ్ మొదలు పెడదాము అని చెపుతున్నట్లు టాక్. 

ఇలాంటి కన్ఫ్యూజన్ తో ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరికి వాయిదా పడిందని దీనికితోడు ఈసినిమాకు సంబంధించి ఎంపిక చేసిన నటీనటుల విషయమై కూడ పూరీకి విజయ్ కు చిన్న గ్యాప్ ఏర్పడింది అని అంటున్నారు. సాధారణంగా పూరీ ఒకసారి తన స్క్రిప్ట్ ఓకె అయ్యాక ఆ స్క్రిప్ట్ మార్చే విషయంలో టాప్ హీరోలు చెప్పినా వినడు. ఇలాంటి పరిస్థితులలో ప్రతి విషయంలోనూ వేలు పెట్టే విజయ్ మనస్తత్వం వలన ఈ మూవీ ప్రాజెక్ట్ సజావుగా జరుగుతుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: