బాలీవుడ్ లో హీరోయిన్ లు ఎంత నాజుగ్గా ఉంటే అంత బాగా నచ్చుతారు జనాలకి. అప్పట్లో కరీనా కపూర్ జీరో సైజ్ అనే కొత్త ట్రెండ్ ని కూడా మొదలుపెట్టారు. కానీ ఇప్పటి తరం కథానాయకులు అలా కాకుండా ఫిట్ గా ఉండటానికి కష్టపడుతున్నారు. తమ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ప్రతి రోజూ జిమ్ లో కసరత్తులు చేస్తూ శరీరంలోని ప్రతి భాగాన్ని తమకు నచ్చినట్లు మార్చుకుంటున్నారు.

 

 అందరి లాగే శ్రీదేవి గారాల కూతురు జాన్వీ కపూర్ కూడా ఎప్పుడు జిమ్ముకి వెళ్తూ ఉంటుంది. షూటింగ్ లలో, పార్టీలలో ఎంత బిజీగా ఉన్నా కూడా జిమ్ముకు టైం కేటాయించుకుని మరి ఈ అమ్మడు కసరత్తులు చేస్తూ ఉంటుంది.ఎంతైనా అతిలోక సుందరి కూతురు కదా అందంలో తల్లికి ఏ మాత్రం తీసిపోదు ఈ ముద్దుగుమ్మ. ఆ చక్కని అందాన్ని కాపాడుకోవడానికి చాలానే కష్టపడుతుంది ఈ ముద్దు గుమ్మ.

 

 

 ఆ అంకితభావంతో నే తనకు అందమైన ఫిజిక్ తెచ్చుకుంటుంది భామ. శరీరంలోని ప్రతి అంగాన్ని వర్ణించేందుకు కొన్ని పేజీల పాఠం రాయాలేమో అన్నట్లు ఉంటుంది ఈ భామ అందం. ఒకే ఒక్క ఫోటో చాలు జాన్వీ శ్రమ పర్ఫెక్ట్ లుక్ అర్థం అవ్వడానికి. ఆ నడుము చుట్టూ అసలు పిసరంత కొవ్వు అనేది లేకుండా మొత్తం కరిగించేసింది.

 

 మరాఠా రీమేక్ చిత్రం దఢక్ తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజులకే తల్లిని కోల్పోయి కొన్ని రోజులు డీలా పడిపోయింది. తిరిగి ఇప్పుడు ఒకేసారి మూడు నాలుగు సినిమాలతో చాలా బిజీగా గడిపేస్తోంది ఈ భామ. గుంజన్ సక్సేనా బయోపిక్ ది కార్గిల్ గర్ల్ త్వరలో రిలీజ్ కి రానుంది. అలాగే రూహ్ అబ్జా అనే చిత్రంలో నటిస్తోంది. కరణ్ జోహార్ దోస్తానా 2 పంజాబ్ షెడ్యూల్ ని జాన్వీ ఇటీవల ముగించింది. ఇక వీటితో పాటు భారీ హిస్టారికల్ చిత్రం తక్త్ లోనూ నటించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: