దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఈ సూత్రం మిగిలిన వారి సంగతేమో కానీ.. సినిమా హీరోయిన్లకు బ్రహ్మాండంగా నప్పుతుంది. అందం ఉన్నప్పుడే... క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు కోట్లు వెనకేసుకునేందుకు హీరోయిన్లు ప్రయత్నిస్తుంటారు. హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ టైమ్ చాలా తక్కువ. అందుకే అవకాశాలు వచ్చినప్పుడు సినిమాలు చాలా వరకూ ఒప్పేసుకుంటారు.

 

అయితే సినిమాలతో పాటు హీరోయిన్లకు కొన్ని సైడ్ బిజినెస్ లు కూడా ఉంటాయి. సైడ్ బిజినెస్ అంటే ఎక్కడికో వెళ్లిపోకండి.. షాపింగ్ కాంప్లెక్సుల ఓపెనింగ్, యాడ్ ఫిలింస్, ఎడ్వర్ టైజ్ మెంట్లు.. ఇలాంటివన్న మాట. ఇక నగలు, చీరల దుకాణాలైతే తప్పనిసరిగా సినిమా హీరోయిన్లే ఓపెన్ చేయాలన్నంతగా ఫిక్స్ అయ్యారు వ్యాపారస్తులు కూడా.

 

అయితే ఈ సైడ్ బిజినెస్ కు తోడు ఇప్పుడు ఇంకో బిజినెస్ వచ్చింది హీరోయిన్లకు అదే వెబ్ సిరీస్. ఇప్పుడు హీరోయిన్లంతా ఈ వెబ్ సీరిస్ ల వైపు చూస్తున్నారు. కొందరు సినిమా అవకాశాలు తగ్గుతుండగానే వీటివైపు చూస్తుంటే.. ఇంకొందరు సినిమాలకు పారలల్ గా వెబ్ సీరిస్ లు చేస్తున్నారు. అందుకే తమన్నా, సమంతా వంటి టాప్ హీరోయిన్లు కూడా ఈ వెబ్ సిరీస్ లకు ఓకే చెప్పేస్తున్నారు.

 

వెబ్ సీరిస్ ల్లోకి అడుగుపెట్టిన సమంత.. తాజాగా ది ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ సీజన్-2లో నటిస్తోంది. ఇందులో ఆమె టెర్రరిస్ట్ రోల్ పోషిస్తుందని టాక్. మరో టాప్ హీరోయిన్ తమన్నా వికటన్ గ్రూప్ ప్రొడ్యూస్ చేయబోతున్న ఓ ఫిమేల్ సెంట్రిల్ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకె చెప్పేసిందట. రీసెంట్ గా ఈ జాబితాలో అందాల నటి , తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా చేరింది. లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ లో ఈషా రెబ్బా నటిస్తోంది. సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ ఎపిసోడ్స్ లో ఈషా రెబ్బా హాట్ హాట్ గా కనిపిస్తుందంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: