'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా అలా వైకుంఠపురములో. బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. సంగీతం తమన్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
అదేమంటే ఈ చిత్రానికి నందమూరి తారక రామారావు నటించిన పుట్టినిల్లు సినిమాకు దగ్గరి పోలికలున్నట్లు ఇప్పుడు ఫిల్మ్నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అదే సినిమా కథను నేటి తరానికి అనువుగా మార్చి త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు అనే విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇందులో నిజమెంత అన్నది మాత్రం దర్శకుడు త్రి విక్రయ్ నోరు విప్పితేగాని తెలియదు. ఇక ఈసినిమా ఇప్పుడు మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరుతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.
ఈ రెండు సినిమాల టీజర్లు యూట్యూబ్ను ఆక్రమించేశాయి. అయితే సామజ వరగమన సాంగ్తో పాటు రాములో రాములా.. పాటలు అల వైకుంఠపురంలో సినిమాకు మంచి ప్లస్గా మారాయి. యూత్ను బాగా ఆకట్టుకున్నాయి. రాములో సాంగ్ యూట్యూబ్లో 50 మిలియన్ల వీక్షణలను దాటడం గమనార్హం.
అదే సమయంలో సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్కు భారీ స్పందన వస్తోంది. మొత్తంగా ఈ సారి సంక్రాంతికి అర్జున్ మహేష్లు బాక్సాఫీస్ వద్ద ఫైట్ చేయనున్నారు.
రెండు సినిమాలపై భారీ అంచనాలుండటం గమనార్హం. ఇప్పటికే రెండు సినిమాలకు సంబంధించిన మార్కెటింగ్ బాగా జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోలకు మంచి ఓవర్సీస్ మార్కెట్ ఉండటంతో విదేశాల్లో ఆడే సినిమా వసూళ్లు బాగానే ఉంటాయని సినిమా వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలో మహేష్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి ఐదున ఎల్బీ స్టేడియంలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం.