చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించాలని పూరీ జగన్నాథ్ ఎన్నోప్రయత్నాలు చేసాడు. ‘ఆటో జానీ’ అన్న కథ పుచ్చుకుని చిరంజీవి మెగా కాంపౌండ్ చుట్టూ ఎన్నో ప్రదక్షణాలు చేసిన పూరీ జగన్నాథ్ కు గతంలో చిరంజీవి వల్ల తీవ్రనిరాశ ఎదురైంది.

అయితే గతంలో పూరీ కథను తిరస్కరించిన చిరంజీవి కొరటాలతో నటించబోతున్న లేటెస్ట్ మూవీ విషయంలో పూరీ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. పూరీ జగన్నాథ్ కు బ్యాంకాక్ లో కూర్చుని అక్కడి బీచ్ లలో రిసార్ట్ లలో తిరుగుతూ తన క్రియేటివిటీ ఉపయోగించి కథలు రాయడం పూరి అలవాటు. ఇది పూరీకి బాగా కలిసి రావడంతో పూరీ ఒక సెంటిమెంట్ గా ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. 

ఇప్పుడు ఇదే పద్ధతి చిరంజీవి అనుసరిస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల చిరంజీవిల మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ నిమిత్తం కొరటాల చిరంజీవిలు మణి శర్మతో కలిసి బ్యాంకాక్ వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ మెలోడి బ్రహ్మ మణిశర్మతో చిరంజీవి కొరటాలలు చాల బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకాక్ పరిసర ప్రాంతాలలో బీచ్ పరిసరాల్లో ప్రైవేట్ రిసార్ట్  లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయట. 

ఈమూవీ పాటల ట్యూన్స్ బాగా రావాలి అన్న ఉద్దేశ్యంతో చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మణి శర్మ నుంచి మంచి క్యాచీ ట్యూన్స్ వచ్చే విధంగా చిరంజీవి గట్టి పట్టుపడుతున్నట్లు సమాచారం.  ఈసినిమా తన ఇమేజ్ కి పొలిటికల్ కెరీర్ కి ప్లస్ అయ్యేదిగా ఉండాలని చిరంజీవి భావిస్తున్నాడట. ఇది ఒక సోషియో పొలిటికల్ థ్రిల్లర్ మూవీ అని అంటున్నారు. గతంలో సిహాచలం దేవస్థానంలో జరిగిన ఒక స్కామ్ ను ఆధారంగా చేసుకుని ఈమూవీ కథను డిజైన్ చేసారు. చిరంజీవి స్థాయికి సరిపడే ఫైట్స్ సాంగ్స్ డ్యాన్సులు డైలాగ్స్ ఇలా ప్రతిచిన్న విషయంలోను శ్రద్ధ తీసుకుంటూ చిరు క్యారెక్టరైజేషన్ లో హీరోయిజాన్ని పీక్స్ లో ఎలివేట్ చేయడమే ధ్యేయంగా కొరటాల ఈమూవీ స్క్రిప్ట్ గురించి దాదాపు ఏడాది కాలం కష్టపడినట్లు తెలుస్తోంది. త్వరలో ఈమూవీ షూటింగ్ ప్రారంభించి ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 14న విడుదల చేయాలని చిరంజీవి కొరటాల కోరిక..

మరింత సమాచారం తెలుసుకోండి: