రికార్డులు క్రియేట్ చేయాల‌న్నా వాటిని తిర‌గ రాయాల‌న్నా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో మ‌హేష్‌బాబుకు మ‌హేషే సాటి. ఈ విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి డౌట్లు లేవు. తాజాగా మ‌హేష్‌బాబు న‌టిస్తోన్న స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా రిలీజ్‌కు ముందే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. సరిలేరు నీకెవ్వరు టీజర్ తో ఫ్యాన్ ని ఊపేసిన మహేష్ నిన్న మొదటి సాంగ్ విడుదల చేసి అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లారు.

 

మైండ్ బ్లాక్ అంటూ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ నిజంగానే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. ఇక ఈ సినిమాలో మైండ్ బ్లోయింగ్ సాంగ్ సంక్రాంతికి థియేట‌ర్ల‌లో ప‌టాస్‌లా పేల‌డం మాత్రం ఖాయం. ఈ సాంగ్‌ను బ్లేజ్ మరియు రనీనా రెడ్డి పాడగా శ్రీమణి, దేవీశ్రీ సాహిత్యం అందించారు.ఇక ఈ సాంగ్ ఇప్పటికే 5 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ దాటివేసింది.

 

ఈ సాంగ్ రిలీజ్ అయ్యి 24 గంట‌లు కూడా దాట‌కుండానే ఏకంగా ఐదు మిలియ‌న్ల వ్యూస్ అంటే మామూలు విష‌యం కాదు. ఇక బ‌న్నీ - త్రివిక్ర‌మ్ అల వైకుంఠ‌పురంలో సాంగ్స్ మూడు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాను షేక్ చేసి ప‌డేస్తున్నాయి. ఈ టైంలో ఆ సినిమాకు పోటీగా సంక్రాంతి రేసులో ఉన్న స‌రిలేరు నీకెవ్వ‌రు కూడా ఇప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తుండ‌డంతో సంక్రాంతి రేసులో ఈ రెండు సినిమాల్లో ఎవ‌రు పై చేయి సాధిస్తారు ? అన్న‌ది ఆస‌క్తిగా ఉంది.

 

టాలీవుడ్‌లో వ‌రుస హిట్ల‌తో దూసుకు పోతోన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, వచ్చే నెల 11న విడుదల కానుంది. ఈ సినిమాకు రు.100 కోట్ల థియేట్రిక‌ల్ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: