బుల్లితెరపై ఎంతమంది యాంకర్స్ ఉన్న కూడా   యాంకర్ సుమకు చాల క్రేజ్ ఎక్కువ. అనసూయ, రష్మి, శ్రీముఖి లాంటి యాంకర్స్ తమ హాట్ నెస్‌తో షోను లాక్కొస్తున్నా.. సుమ మాత్రం తన మాటల ప్రవాహంతో చక్కని కట్టుబొట్టు, వాక్చాతుర్యంతో గత 15 ఏళ్లుగా టాప్ యాంకర్‌గా ముందుకు కొనసాగుతుంది. కానీ గత కొంతకాలంగా ఆమె షోలలో కూడా ద్వందార్ధాలు, బూతు డోస్ పెంచింది అంటే నమ్మండి.

 

తాజాగా సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ షోకి సంబంధించి వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయడం జరిగింది. ఇందులో ఫలక్‌నుమా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్‌తో పాటు కమెడియన్ మహేష్, అభినవ్ గోమఠం, హీరోయిన్ సిమ్రన్‌లు గెస్ట్‌లుగా రావడం జరిగింది. గెస్ట్‌గా వచ్చిన విశ్వక్ సేన్‌కి తాంబూలం ఇచ్చి స్వాగతం పలికింది సుమ. తాంబూలం తీసుకుని తింటున్న విశ్వక్ సేన్ దేనికి తింటున్నా.. ఇది అనడంతో ‘నాకూ తెలియదు వాళ్లు పెట్టారు.. తింటున్నా’ అంటూ పంచ్‌తో ప్రోమోలో మనకు బాగా అర్థం అవుతుంది.

 

ఇక ఈ క్యాష్  షోలో అభినవ్, విశ్వక్, మహేష్‌లు ఓ స్కిట్ వేయడం జరిగింది.  ఈ స్కిట్లో విశ్వక్ సేన్, అభినవ్‌లు పోలీస్‌లుగా మహేష్‌ని పట్టుకుని లైట్లు ఎందుకు దొంగిలించావ్ అని పట్టుకుని విచారణ చేపట్టడం జరుగుతుంది . మహేష్ నోట్లో టమోటొపెట్టి అది కింది పడితే నవ్వే దొంగతనం చేసినట్టు అని అనడంతో మహేష్ ఆ టమోటాను కసాపిసా నమిలి మింగేయడం జరుగుతుంది. 

 

సుమ మహేష్‌ని మీరు ఏ సందర్భంలో ఆ ఒక్కటీ అడక్కు అని అంటారు అని  అడగడంతో మహేష్ సమాధానం చెప్పు.. ఎలాంటి సందర్భంలో అభినవ్ అని అతని సాయం కోరాడు.. దానికి అభినవ్ ‘ఇలాంటి సందర్భంలో’ అంటూ ఆటో పంచ్ వేయడం జరిగింది. షోకి వచ్చిన మహేష్, విశ్వక్ సేన్‌లను అవార్డులతో సుమ సత్కరించడం జరిగింది. విశ్వక్ సేన్‌కి ఫలక్‌నుమా దాస్‌ సినిమాలోని బూతులకు గానూ.. బెస్ట్ మ్యూట్ స్పెక్టేటర్ అవార్డ్ ఇవ్వడం జరిగిని. ఇక మహేష్‌ పంచ్‌లకు సుమ ఉత్తమ దిక్కుమాలిన జస్టిఫికేషన్ అవార్డ్ ఇవ్వడం జరిగింది.

 

ఫలక్‌నుమా దాస్‌ చిత్రంలోను బూతులతో ఫేమస్ అయిన ఈ చిత్రంలోని ఫేమస్ బూతు డైలాగ్‌ను క్యాష్‌ షోలో సుమ ముందు చెప్పి ఆమె చెవులు మూసుకునేలా చేసాడు విశ్వక్ సేన్. ఈ షోకి వచ్చిన స్టూడెంట్స్ అందరితోనూ ఈ బూతు రోతను మాట్లాడిస్తూ నవ్వించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: