సాధారణంగా ఐటమ్ సాంగ్స్ కోసం బాలీవుడ్ బ్యూటీలను తీసుకుంటూ ఉంటారు. మలైకా కత్రిన సన్నీలియోన్ లాంటి హాట్ బ్యూటీలకు భారీ పారితోషికాలు ఇస్తారు. గత కొంతకాలంగా తమన్నా పూజా హెగ్డే కాజల్ శృతి హాసన్ లాంటి టాప్ హీరోయిన్స్ కూడ తెలుగు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. 

దీనికి భిన్నంగా ఇప్పుడు రామ్ పూరీ కొడుకు ఆకాష్ కోసం ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది.  గతంలో టాప్ హీరోలు వెంకటేష్ ఎన్టీఆర్ లు కూడ వారికి బాగా సన్నిహితమైన హీరోల సినిమాల విషయంలో ఇలా కొన్ని స్పెషల్ సాంగ్స్ లో కనిపించారు.

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చిన రామ్ తనకు అటువంటి హిట్ ను ఇచ్చిన పూరీకి కృతజ్ఞతగా అతడి కొడుకు ఆకాష్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ను చేయడానికి అంగీకరించడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. ఆకాష్ ను హీరోగా చేయాలని పూరీ తానే నిర్మాతగా మారి ‘మెహబూబా’ లాంటి భారీ సినిమాను తీసి ఆ సినిమా వల్ల ఆర్ధికంగా చాల నష్టపోయాడు. ఇప్పుడు జరిగిన పొరపాటు గ్రహించి పూరీ తన కొడుకు లేటెస్ట్ మూవీ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

ఈ ప్రయత్నాలలో భాగంగానే రామ్ ఐటమ్ సాంగ్ అని అంటున్నారు. ‘రొమాంటిక్’ అన్న టైటిల్ తో నిర్మింప బడుతున్న ఈమూవీలో ఈటైటిల్ కు తగ్గట్టుగా చాల హాట్ రొమాంటిక్ సీన్స్ ఉండబోతున్నాయి. ఒక భారీ సెట్ వేసి ఒక మాస్ మసాలా సాంగ్ ను రామ్ పై చిత్రీకరిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆకాష్ కు ప్రస్తుతం క్రేజ్ ఏమీలేని పరిస్థితులలో కేవలం రామ్ స్పెషల్ సాంగ్ కోసం యూత్ ఎంత వరకు ధియేటర్స్ కు వస్తారు అన్నది సమాధానం లేని ప్రశ్న..

 

మరింత సమాచారం తెలుసుకోండి: