విజయ్ దేవరకొండ పై బాలీవుడ్ హీరోయిన్స్ బాగా ఆకర్షింప బడుతున్న పరిస్థితులలో విజయ్ కు జోడిగా ఒక టాప్ బాలీవుడ్ హీరోయిన్ సెట్ చేయాలి అని ప్రయత్నాలు చేసిన పూరి ఛార్మీ ప్రయత్నాలకు ఊహించని షాక్ తగిలింది అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తతం పూరి తన కొడుకు రొమాంటిక్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటూనే విజయ్ తో తాను మొదలు పెట్టవలసిన మూవీ హీరోయిన్ కోసం చేస్తున్న ప్రయత్నాలకు బాలీవుడ్ హీరోయిన్స్ నుండి తీవ్ర తిరస్కరణ ఎదురైంది అన్న వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య ఛార్మీ పూరీ సలహాతో జాన్వీ కపూర్ ను కలిసి విజయ్ దేవరకొండ పక్కన నటించవలసిందిగా కోరినట్లు టాక్. ‘కాఫీ విత్ కరణ్ జోహార్’ కార్యక్రమంలో జాన్వీ తనకు విజయ్ దేవరకొండ పై క్రష్ ఉంది అని ఓపెన్ గా చెప్పిన నేపధ్యంలో తన ఆఫర్ కు జాన్వీ నుండి సానుకూల స్పందన వస్తుందని పూరీ ఛార్మీలు ఆశించి ఈ రాయబారం చేసినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ ఆఫర్ వివరాలు తెలుసుకున్న జాన్వీ 7 కోట్ల భారీ పారితోషికంతో పాటు ఇంకా అనేక కండిషన్స్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తరువాత వారి నెక్స్ట్ టార్గెట్ గా కియరా అద్వానీని సంప్రదిస్తే ఆమె కూడ భారీ పారితోషికం అడగడమే కాకుండా ప్రస్తుతం తన వద్ద డేట్స్ లేవు అని చెప్పినట్లు సమాచారం. 

ఈమధ్య  కియారా విజయ్ దేవరకొండలు కలిసి ఒక ప్రముఖ వ్యాపార సంస్థకు సంబంధించిన యాడ్ లో నటించడంతో వీరి కాంబినేషన్ పై మంచి క్రేజ్ ఏర్పడింది. దీనితో ఈ కాంబినేషన్ సెట్ చేయాలి అన్న పూరీ ఆలోచనలు కూడ ముందుకు సాగడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు పూరీ విజయ్ దేవరకొండతో తీయబోతున్న మూవీని హిందీలో కూడ విడుదల చేయాలి అన్న ఆలోచనలో ఉన్న పరిస్థితిలో అతడి వ్యూహాలకు బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ నుండి సరైన స్పందన రాకపోవడంతో ఈ మూవీ ప్రాజెక్ట్ ను ఇక కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం చేయాలని పూరీ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: