నరకాసురుడుని సత్యభామ శ్రీకృష్ణులు వధించిన నేపధ్యాన్ని గుర్తుకు చేసుకుంటూ యుగయుగాలుగా దీపావళి పండుగ చేసుకుంటున్నట్లుగా ఈరోజు తెల్లవారుజామున దిశ పై త్యాచారం చేసిన ఆ నలుగురుని పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపివేశారు అన్న వార్తలు తెల్లవారుతూనే బ్రేకింగ్ న్యూస్ గా బయటకు రావడంతో ఆనందంతో జనం ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. ఈ సంఘటన జరిగిన స్థలానికి వేలాది సంఖ్యలో జనం రావడమే కాకుండా పోలీసుల పై పూల వర్షం కురిపిస్తూ వారికి స్వీట్స్ తినిపిస్తున్న సంఘటను చూసిన వారికి ఒక పండుగ వచ్చిందా అన్న ఆనందం కలుగుతోంది.

దిశ కేసుకు సంబంధించి నిడుతులను ఈ క్రైమ్ కు సంబంధించిన సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసే ఉద్దేశ్యంతో నిందుతులను ఈరోజు తెల్లవారుజామున దిశ పై అత్యాచారం జరిగిన స్పాట్ కు తీసుకు వెళ్ళారు. అయితే చటాన్ పల్లి వద్ద ఆ నిందుతులు పారిపోవడానికి ప్రయత్నించడంతో ఈ ఎం కౌంటర్ జరిగింది అని తెలుస్తోంది. 

ఈ వార్త వైరల్ కావడంతో చాల ముందుగా మంచు మనోజ్ స్పందించాడు. దిశను అత్యాచారం చేసి చంపేసిన పోలీసులకు పాదనమస్కారం చేయాలని ఉందని ఆ ఎన్  కౌంటర్ కు వాడిన బుల్లెట్స్ ను అనుమతిస్తే దాచుకోవాలని ఉందని ఆ ఎన్కౌంటర్ కు వాడిన తుపాకీలకు సెల్యూట్ చేయాలని ఉందని అంటూ భావోద్వేగంతో ట్విట్ చేశాడు.

ఈ సంఘటన పై నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మంచులక్ష్మీ కూడ స్పందిస్తూ దిశకు న్యాయం జరిగింది అంటూ భావోద్వేగంతో కామెంట్స్ పెట్టారు. దేశ వ్యాప్తంగా జనం కోరుకున్న శిక్ష దిశ నిందితుల పై అమలు జరగడంతో పార్టీలకు వర్గాలకు అతీతంగా అందరు పోలీసులను అభినందిస్తున్నారు. ఈ సంఘటనతో కనీసం భయం ఏర్పడి ఇక పై అయినా స్త్రీల పై అత్యాచారాల సంఘటనలు జరగకుండా ఉంటే అది దిశకు మనం అందరం ఇచ్చే నిజమైన నివాళి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: