తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న దిశ అత్యాచారం, హత్య ఘటనకు ఈ రోజు ఓ ముగింపు పలికారు తెలంగాణ పోలీసులు. కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా నింధితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు వాళ్లు తిరగబడటంతో ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అయితే ఈ సంఘటనపై యావత్ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఈ మృగాలను చూసి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు.. ఈ విషయంపై దిశ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఉదయం లేవగానే ఈ వార్త చెవిన పడటంతో అందరూ ఆనందంతో గంతులు వేస్తూ న్నారు...దాదాపుగా పదిరోజులు పాటుగా చేసినా ఈ కన్నీటి పర్యంతనికి నేటితో పోలీసుల సహకారం తో శుభం కార్డు పలికింది..
ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు.
సోషల్ మీడియా వేదిక గా పోలీ సులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.. హీరోలు అంటే మేము కాదు ఎవల తెలంగాణ ప్రజలు చేసిన పోలీసులు చేసిన దైర్యమే అంటూ పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు..ఈ సందర్భంగా కొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఈ విషయాన్ని ప్రశంసలు కురిపిస్తున్నారు. ..
స్పందించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ `సెల్యూట్, తెలంగాణా పోలీస్ డిపార్డ్మెంట్కి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరే నిజమైన హీరోలు. నేను ఎప్పుడూ ఒక విషయాన్ని నమ్ముతాను.. మనకి కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు వేక్ ఒబెరాయ్ కూడా స్పందించాడు. `అదే చోటు అదే సమయం, రాక్షసులు అంతం అయ్యారు. ఇదే నిజమైన న్యాయం. ఇప్పుడు అలాంటి దుర్మార్గులందరికీ భయం కలుగుతుంది. టాలీవుడ్ టాప్ హీరోలు సైతం ఈ సంఘటనపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఎన్టీఆర్, నాగార్జున, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్లు కూడా ఈ సంఘటనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు నిందించిన ప్రజలు ఇప్పుడు పోలీసులకు జేజేలు పలుకుతున్నారు..