సాయి ధరమ్ తేజ్ తన పేరును సాయి తేజ్ గా మార్చుకున్న తరువాత ఒక సూపర్ హిట్ కొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈనెల 20న విడుదలకాబోతున్న ‘ప్రతిరోజు పండగే’ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమాను చూసిన వారు ఈ సినిమా బాగుందని అయితే ఈ సినిమా సంక్రాతికి విడుదల అయి ఉంటే గ్యారంటీ హిట్ గా మారి ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. 

ఈ కామెంట్స్ విని సాయి తేజ్ ఆందోళన పడుతునట్లుతెలుస్తోంది. వా’స్తవానికి ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని సాయి తేజ్ భావించినా తన సినిమాను నిర్మిచిన అల్లు అరవింద్ అల్లు అర్జున్  ‘అల వైకుంఠపురములో’ మూవీకి కూడ నిర్మాత అయిన నేపధ్యంలో సంక్రాంతి పండక్కి వచ్చే అదృష్టం సాయి ధరమ్‌ తేజ్‌ కి దక్కలేదు. 

గతంలో కూడ సాయి ధరమ్‌ తేజ్‌ వరుణ్‌ తేజ్‌ లు ఇలా పలుమార్లు రామ్ చరణ్ అల్లు అర్జున్ లకోసం రాజీపడవలసి వచ్చింది. తమ కుటుంబం నుంచే పెద్ద స్టార్లు ఉండడంతో వాళ్ల సినిమాలు మంచి సీజన్లకి పండుగలకి వస్తోంటే సాయి తేజ్ వరుణ్ తేజ్ ల సినిమాలకు పండుగ సీజన్ దొరకడం లేదు అన్న ఫీలింగ్ సాయి తేజ్ కి ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. 

దీనితో పలుమార్లు తన చిత్రాలని ప్రీమియమ్‌ రిలీజ్‌ డేట్లకి రిలీజ్‌ చేసుకోలేకపోయిన సాయి ధరమ్‌ తేజ్ ఇక కేవలం తన అదృష్టం మాత్రమే తనను రక్షిస్తుంది అన్న వేదాంతంలో ఉన్నట్లు టాక్. దీనికితోడు మారుతి ‘శైలజా రెడ్డి’ ఫెయిల్యూర్ తరువాత తీసిన సినిమా కావడంతో ఈ మూవీకి ఎంతవరకు క్రేజ్ ఏర్పడుతుంది అన్న భయాలు కూడ సాయి తేజ్ ను వెంటాడుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఈ మూవీ బాలయ్య సల్మాన్ ఖాన్ ల భారీ సినిమాల మధ్య చిక్కు కోవడం కూడ సాయి తేజ్ ను కలవర పెడుతున్నట్లు సమాచారం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: