ప్రతి ఒక్కరికి దేవుడిపైన భక్తి ,నమ్మకం బాగానే ఉంటాయి ఐతే ఈ విషయంలో నటి నయనతారకు భక్తి అధికమేనని చెప్పవచ్చు. నయనతార ప్రియుడు విఘ్నేశ్శివన్తో కలిసి ఆ మధ్య అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కు వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. అంతేకాదు ఇటీవల తిరుమలకు వెళ్లి దేవదేవుడిని దర్శించుకున్నారు. తాజాగా భగవతి అమ్మవారి ఆలయం కన్యాకుమారిలోని బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయం దీనికి వీరిద్దరూ అక్కడ మూక్కుత్తి అమ్మన్గా దర్శనం ఇచ్చే అమ్మవారు చాలా మహిమ కలిగిన దేవతగా ప్రతీతిని దర్శించుకున్నారు .
కాగా త్వరలో మూక్కుత్తి అమ్మన్ అనే భక్తి రస కథా చిత్రంలోనటి నయనతార అమ్మవారిగా నటించనున్నారు. కన్యాకుమారిలో ఆలయాన్ని దర్శించుకున్న నయనతారకుమారిలో ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ చిత్ర షూటింగ్లో నయనతార ఆ సమయంలో విదేశాల్లో ఉండడంతో పాల్గొనలేకపోయారని చిత్ర వర్గాలు తెలిపారు. కాగా ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చిన నయనతార సోమవారం తన ప్రియుడితో కలిసి కన్యాకుమారికి వెళ్లి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భగవతి ఆలయాన్ని సందర్శించి మూక్కూత్తి అమ్మన్ను దర్శించుకున్నారు.
సుమారు అరగంట పాటు వీరిద్దరూ అమ్మవారి ముందు కూర్చుని ప్రార్థించుకున్నారు. అనంతరం గుడి చుట్టూ ప్రదర్శనం చేశారు. కాగా మూక్కుత్తి అమ్మన్ అలయంలో మాములుగా ఈ సీజన్లో శబరిమలకు వెళ్లే సమయం కాబట్టి అయ్యప్ప భక్తులతో కళకళలాడుతోంది. కాగా అక్కడ ఉన్న అయ్యప్ప భక్తులకు నయనతార నమస్కరించారు. ఆ ప్రాంతంలో నయనతార గుడికి వచ్చిన విషయం అంతా వ్యాపించడంతో చుట్టు పక్కల ప్రాంతాలను నుంచి ప్రజలు ఆమెను చూడడానికి దండోపాదండలుగా విచ్చేసారు.దీంతో ఆ ప్రాంతంలో తోపులాట జరిగింది. అయితే నయనతార ఆలయానికి రానుండడంతో దేవాలయ నిర్వాహకులు పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.
నయనతారకు కొందరు మహాళా పోలీసులు రక్షణగా నిలిచారు. వారి సాయంతో నయనతార క్షేమంగా అక్కడ నుంచి బయట పడ్డారు. కాగా నయనతారతో మహిళా పోలీసులు ఫొటోలు తీసుకోవడానికి ఆసక్తి చూపడంతో ఆమె వారితో సెల్ఫీలు దిగి సంతోష పరిచారు. కాగా నయనతార త్వరలో కన్యాకుమారిలో జరుగుతున్న మూక్కుత్తి అమ్మన్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారు. ఈ చిత్ర షూటింగ్ కాలం అంతా నయనతార శాఖాహారిగా మారి నియమాలను పాఠించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.