రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీయార్ హీరోలుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. 2020 జులై 30వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ ఈ సినిమాలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీయార్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. 
 
ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తూ ఉండటం, బాహుబలి2 సినిమాతో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించిన రాజమౌళి ఈ సినిమాతో బాహుబలి2 సినిమాను మించిన విజయాన్ని అందుకోవాల్సి ఉండటంతో టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ, కథనం విషయాల్లో కూడా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాకు పని చేసే టెక్నీషియన్లకు రాజమౌళి సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు లీక్ కాకుండా చాలా షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. 
 
ఆంధ్రా కు చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీం కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుందనే కథతో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలను తీసుకొని కల్పితమైన కథతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రాజమౌళిసినిమా ప్రమోషన్ల విషయంలో బాహుబలి స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. 
 
2019 డిసెంబర్ 31వ తేదీన లేదా 2020 జనవరి 1వ తేదీన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఆర్ఆర్ఆర్ పూర్తి టైటిల్, కొమరం భీం ఫస్ట్ లుక్ విడుదల చేయబోతుందని తెలుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తూ ఉండటం, దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా హక్కుల కోసం భారీగా ఆఫర్లు వస్తున్నప్పటికీ టీజర్ విడుదలైన తరువాత సినిమా హక్కులను విక్రయించే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: