ట్విట్టర్ లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటాడు యంగ్ హీరో నితిన్. తన ఫ్యాన్స్ తన సినిమాల గురించి ఏమైనా అడిగినా కూడా వాటికీ రిప్లై లు ఇస్తాడు. అందులో భాగంగా కొన్ని రోజుల నుండి భీష్మ అప్డేట్ ఇవ్వండని ఫ్యాన్స్ ,
ట్విట్టర్ లో
నితిన్ ను కోరుతున్నారు. వారి కోరిక ను అర్ధం చేసుకున్న నితిన్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చాడు. ఈనెల 27న ఈ చిత్రం నుండి మొదటి సాంగ్ విడుదలకానుందని
నితిన్ ట్వీట్ చేశాడు. ఇంతకుముందు భీష్మ ఫస్ట్ లుక్ ను కూడా అక్టోబర్ 27నే విడుదలచేశారు. మళ్ళీ ఇప్పుడు సాంగ్ ను అదే డేట్ కి రిలీజ్ చేయనుండడం విశేషం.
ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. యూత్ ఫుల్ల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ఈ చిత్రం విడుదలకానుంది. ఇక నితిన్ ఈ చిత్రంతో పాటు మరో రెండు సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు.
అందులో భాగంగా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రంగ్ దే తో పాటు సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. రంగ్ దే లో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న చిత్రంలో నితిన్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ , మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. భీష్మ తోపాటు ఈరెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలోనే విడుదలకానున్నాయి. ఇక అ ఆ తరువాత వరుసగా హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసిన నితిన్ మరి ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సాదిస్తాడో లేదో చూడాలి.