గత కొంత కాలంగా  అనారోగ్య సమస్యలతో  సతమతవుతూ షూటింగ్ లకు  బ్రేక్ ఇచ్చిన  దగ్గుబాటి హీరో రానా  ప్రస్తుతం  పూర్తిగా  కోలుకున్నాడు. దాంతో ఎట్టకేలకు  చాలా గ్యాప్ తరువాత ఆయన సెట్ లో అడుగు పెట్టాడు. అందులో భాగంగా రానా ప్రస్తుతం   విరాట పర్వం లో నటిస్తున్నాడు. ఈచిత్రం  యొక్క షూటింగ్  రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈషెడ్యూల్ లో రానా పాల్గొంటున్నాడు.  ఇక ఈ రోజు రానా బర్త్ డే సందర్భంగా  చిత్ర యూనిట్   విరాటపర్వం నుండి రానా ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు. 
 
 
నీదినాది ఒకే కథ ఫేమ్  వేణు ఊడుగుల  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో   ఫిదా బ్యూటీ సాయి పల్లవి  హీరోయిన్ గా నటిస్తుంది. ఈచిత్రం లో ఆమె నక్సలైట్ పాత్రలో  కనిపించనుందని సమాచారం.  వీరితో పాటు మలయాళ నటి  నందితా దాస్ కీలక పాత్రలో నటిస్తుంది.1990  బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్సివ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిసురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఎల్ వి సినిమాస్  బ్యానర్ల  పై  సురేష్ బాబు , చెరుకూరి సుధాకర్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో  ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. 
 
 
 
ఇక ఈ సినిమా తోపాటు   రానా పౌరాణిక చిత్రం  హిరణ్య కశ్యప లో నటించనున్నాడు. గుణశేఖర్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో సురేష్ ప్రొడక్షన్స్  నిర్మించనుంది. వచ్చే ఏడాది ప్రథమార్థం లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుంది.  వీటితోపాటు రానా  నిర్మాత  మారి తమిళ నటుడు  విజయ్ సేతుపతి  హీరోగా  ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడు.   శ్రీలంక మాజీ క్రికెటర్ , లెజండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీపతి దర్శకుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: