అతి త్వరలో నందమూరి బాలకృష్ణ రూలర్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు రాక ముందే తన తరువాతి సినిమాని మొదలు పెట్టాడు నట సింహం. బాలయ్యకు మంచి సూపర్‌ హిట్స్‌ సాధించిన స్టార్‌ దర్శకుడితో హ్యాట్రిక్‌ సినిమా మొదలు పెట్టాడు. ఈ  హ్యాట్రిక్‌  దర్శకుడితో పాటు  ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఉంది అని బాగా అర్థం అవుతుంది.

 

నిజానికి  ఎవరు ఆ దర్శకుడు అని అనుకుంటున్నారా..ఇంకా ఎవరు అండి బోయపాటి శ్రీను. గతంలో కూడా బాలయ్య హీరోగా సింహా, లెజెండ్‌ లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలను అందించాడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం మాత్రం బాలయ్య 105వ సినిమాగా రాబోతున్న రూలర్‌ సినిమా షూటింగ్లో చాల  బిజీగా ఉన్నడు బాలకృష్ణ. అంతే కాదు  ఇప్పటికే ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించిన చిత్రయూనిట్ త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లేందుకు సిద్దాంగా ఉంది. మరి  ఈ సినిమాకు మిరియాల రవీందర్‌ రెడ్డి నిర్మాతగా వహిస్తున్నారు.

 


ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి అభిమానులు  బాలయ్యను చూడాలనుకుంటున్నారో  అంతకు పైగా  చూపించటంలో బోయపాటికి ఎవరు సరిలేరు ఆంటే నమ్మండి. ఇంకా ఇక్కడ ఇంకో శుభవార్త ఉంది ..ఈ సినిమాలో విలన్‌గా సీనియర్‌ హీరో శ్రీకాంత్‌ కూడా ప్రేక్షకుల  ముందుకు వస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ప్రతినాయకుడిగా  శ్రీకాంత్‌ను తీసుకునే భావనలో బోయపాటి ఉన్నట్టుగా సమాచారం. గతంలో కూడా యుద్ధం శరణం సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో నటించిన శ్రీకాంత్ మంచి విజయం సాధించలేక పోయాడు. కాబ్బటి ఇప్పుడు ఐనా  బోయపాటి సినిమాతో  బ్రేక్‌ వస్తుందన్న ఆశతో ఉన్నాడు శ్రీకాంత్ అని సమాచారం.

 

 


ఇది ఇలా ఉండగా జగపతి బాబును ఎందుకు తీసుకోలేదు అన్న అనుమానాలు వాస్తు ఉన్నాయి. గతంలో బాలయ్య హీరోగా వచ్చిన లెజెండ్ సినిమాతో జగపతి బాబును నెగెటివ్‌ రోల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చాడు బోయపాటి.  ఈ సినిమాతో జగపతి బాబు టాలీవుడ్‌లో బిజీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా అయ్యాడు. ఇప్పుడు అదే బాటలో శ్రీకాంత్‌ కెరీర్‌కు బూస్ట్‌ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు ఈ మాస్ డైరెక్టర్‌.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: