తమిళ సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ , నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం జై సింహ. ఈసినిమా కు ముందే కేఎస్ రవికుమార్ ఫామ్ కోల్పోయి చాలా కాలం అవ్వగా అప్పటికి పైసా వసూల్ తో భారీ డిజాస్టర్ ను చవి చూశాడు బాలకృష్ణ . దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. అయితే సినిమా స్టార్ట్ అయ్యిందో లేదో కేవలం రెండు నెలల్లో సినిమా ను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. ఇక గత ఏడాది
సంక్రాంతి విడుదలైన ఈసినిమా కు రివ్యూస్ కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. అయితే ఈచిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. అదే సమయానికి విడుదలైన అజ్ఞాతవాసి డిజాస్టర్ కావడంతో జై సింహ పై ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. అలా నెగిటివ్ టాక్ తో స్టార్ట్ అయిన ఈ చిత్రం క్రమక్రమంగా పుంజుకొని ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి హిట్ అనిపించుకుంది. సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
ఇక సంవత్సరం తిరగకుండానే మళ్ళీ ఇదే కాంబినేషన్ లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రూలర్. వచ్చే శుక్రవారం ఈచిత్రం విడుదలకానుంది. ఈసినిమా కు ముందు కూడా బాలయ్య , ఎన్టీఆర్ బయోపిక్ తో భారీ డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. దాంతో మరోసారి కేఎస్ రవికుమార్ నే నమ్మాడు. అలా రూలర్ సెట్స్ పైకి వెళ్లడం రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకోవడం కట్ చేస్తే ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. అయితే రూలర్ , జై సింహ లా కాకుండా 30కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక హిట్ కాంబినేషన్ నే అయినా ఎన్టీఆర్ బయోపిక్ ప్రభావం ఈ సినిమా పై పడడం అలాగే టీజర్ , ట్రైలర్ లు పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోవడంతో 20కోట్ల లోపే ఈచిత్రాన్ని అమ్మాల్సి వచ్చింది. అయితే నాన్ థియేట్రికల్ రూపంలో మిగితా బడ్జెట్ కవర్ కావడం వల్ల నిర్మాత సేఫ్ పొజిషన్ లోనే వున్నాడు.
అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే డిసెంబర్ 20న ఈ చిత్రం తోపాటు సాయి ధరమ్, ప్రతి రోజూ పండగే , సల్మాన్ ఖాన్ ,దబంగ్ 3, కార్తి , దొంగ కూడా విడుదలకానున్నాయి. వీటిలో దబంగ్ 3, దొంగ వల్ల నష్టమేమి కాదుకానీ ప్రతి రోజూ పండగే తో మాత్రం కలెక్షన్స్ కు దెబ్బ పడే అవకాశాలు వున్నాయి. అయితే ఈ పోటీని తట్టుకొని యావరేజ్ కంటెంట్ తో రూలర్ ,జై సింహ మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో లేక బోల్తాపడతుందో చూడాలి. ఇక ప్రస్తుతం రూలర్ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఈరోజు గ్రాండ్ గా జరుగుతుంది.