టాలీవుడ్ లో వారసుల హవా ఎక్కువ. అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి విజయ్ దేవరకొండ వరకూ అందరూ తమ వారసులను సినీ ఫీల్డ్ కి పరిచయం చేసినవారే. వారసత్వపు హీరోలు, హీరోయిన్లతో టాలీవుడ్ కలకళలాడింది. గత దశాబ్దం మాదిరిగానే ఈ దశబ్దంలో కూడా వారసుల హవా బాగానే నడిచింది. టాలీవుడ్ అగ్ర కుటుంబాల నుంచి ఇప్పుడొచ్చిన హీరోల, హీరోయిన్ల నుంచి కూడా వారసులు రావడం విశేషం.

 

 

మెగా కుటుంబం నుంచి నాగబాబు కొడుకు, కుమార్తె.. వరుణ్, నిహరిక పరిచాయమయ్యారు. మెగా మేనల్లుడుగా సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కూడా వచ్చాడు.  అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం హీరో అఖిల్. చాలా గ్రాండ్ గా వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మాతగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. వెంకటేశ్ కుటుంబం నుంచి సురేష్ బాబు కుమారుడు రానా కూడా ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబు కొడుకు గౌతమ్ కూడా వన్ సినిమాతో పరిచయమయ్యాడు. కుమార్తె వాయిస్ ఓవర్, వెబ్ సిరీస్ తో పరిచయమైంది. అల్లు అర్జున్ తమ్ముడు అలకు శిరీష్ వచ్చాడు. రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాటోగ్రఫర్ చోటా కె నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్ హీరో అయ్యాడు. టెక్నీషియన్ల పరంగా రాజమౌళి కుమారుడు, కీరవాణి కుమారుడు, మణిశర్మ కుమారుడు వచ్చారు.

 

 

మొత్తానికి ఈ దశబ్దమంతా కొత్త నీరు వచ్చిందని చెప్పాలి. టాలెంట్ పుష్కలంగా ఉన్న వీరంతా తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు. తెలుగు సినిమాను మరింత హంగులు అందిస్తున్నారు. వారసత్వంతో పాటు వీరంతా కష్టపడుతూ నిలదక్కుకున్నారు.. కొందరు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. వీరంతా మునుముందు మరిన్ని విజయాలు అందించి టాలీవుడ్ పేరు నిలబెట్టాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: