విక్టరీ వెంకటేశ్ ,యువ సామ్రాట్ నాగ చైతన్య ల మల్టీ స్టారర్  వెంకీ మామ గత శుక్రవారం  విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను రాబట్టుకుంది అయితే టాక్ బాగుండడం తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద  అదరగొట్టింది.  కేవలం మూడు రోజుల్లోనే ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా  45కోట్ల  గ్రాస్ వసూళ్లను రాబట్టి  వెంకీ , చైతన్య కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది.  ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులను నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.  ఇక  తెలుగు రాష్ట్రాల్లో  ఈ చిత్రం  16కోట్ల  షేర్ ను రాబట్టి  ప్రీ రిలీజ్ బిజినెస్ లో 65శాతం  వెనక్కు తెచ్చింది. అలాగే  నైజాం లో ఈచిత్రం  మూడు రోజుల్లో 6.60కోట్ల షేర్ ను రాబట్టింది. రేపటి తో ఈ చిత్రం అక్కడ బ్రేక్ ఈవెన్ కానుంది. బాబీ డైరెక్షన్ లో   పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కిన  ఈ చిత్రంలో  వెంకీ సరసన  హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించగా   నాగ చైతన్య కు  జోడిగా  రాశీ ఖన్నానటించింది.   సురేష్  ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై  సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్  సంయుక్తంగా నిర్మించిన  ఈచిత్రానికి తమన్ సంగీతం అందించాడు.  
 
 
ఇక  ప్రస్తుతం  నాగ చైతన్య, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటిస్తుండగా  వెంకటేష్ మాత్రం వెంకీమామ తరువాత మళ్ళీ  సెట్ లోకి అడుగుపెట్టలేదు. అయితే  కోలీవుడ్   బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ  అసురన్  తెలుగు రీమేక్ లో నటించాడనికి వెంకీ ఇటీవల  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  ప్రముఖ తమిళ నిర్మాత  కలై పులి ఎస్ థాను తో కలిసి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. త్వరలోనే ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: