సీనియర్ దర్శకడు నిర్మాత అయినా తమ్మారెడ్డి భరద్వాజ గారు ‘జబర్దస్త్’ కామెడీ షోపై జనాలు తేరుకోలేని షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇటీవల జబర్దస్త్ జడ్జి నాగబాబు జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే కదా. దీనితో ఈ షోపై బుల్లితెర వర్గాల్లో హాట్ , హాట్ టాపిక్ నడుస్తున్న విషయం మన అందరికి తెలిసిందే కదా. ఈ సమయంలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. జబర్దస్త్‌ను నేను ఎప్పుడూ ఒక్క ఏపీ సోడ్ కూడా చూడలేదు.. జబర్దస్త్ ప్రోగ్రాము వల్ల సమాజానికి ఎటువంటి ప్రయోజనం ఏమి లేదు. దీని వల్ల సమాజానికి ఏం ఉపయోగం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేయడం జరిగింది.

 


ఇక మరో వైపు ఒక విధంగా చెప్పాలంటే.. నేను ఇప్పటి వరకూ జబర్దస్త్ షో ఒక్కటి కూడా అంటే ఒక్కటి కూడా చూడలేదు అంటే నమ్మండి. ఒక్కటంటే ఒక్క ఎపిసోడ్ కూడా చూసింది లేదు. కాని ఈ షో నంబర్ వన్ షో అని జనాలు తెలుపుతూ ఉంటారు అని అన్నారు.  నేను తెలుగు సినిమా 75 ఇయర్స్ చేస్తున్నప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు జబర్దస్త్ షోకి సంబంధించిన 50 స్కిట్స్ సీటీలను చూడమని తెచ్చి ఇవ్వడము జరిగినది. ఆ యాభై స్కిన్స్ చూసిన నేను ఒక్కటి కూడా బాగాలేదు. ఎందుకో చండాలంగా ఉన్నాయి అన్నీ అనిపించింది కానీ ఒక పెద్ద తరము ( 50 సంవత్సరములు దాటిన వాళ్ళు) వాళ్లకు జబర్దస్తు నచ్చదు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అని అన్నారు. ఇది ఇంత పెద్ద షో ఎలా అయ్యిందయ్యా అని చెప్పేసి ఆ సీడీలను తిరిగి ఇచ్చేశాను.. జబర్దస్త్ ఎపిసోడ్‌లు చూడలేదు కాని ఈ యాభై స్కిట్స్ చూశాను అని తెలియచేయడం జరిగింది.

 

నేను ఎంకరేజ్ చేస్తేనే గొప్పవాళ్లు అవుతారనేదాంట్లో అసలు నిజం లేదు. ఇక్కడ నాకే దిక్కులేదు. చిరంజీవి, సుమన్, భాను చందర్ ఇంతకుముందు నా దగ్గర సినిమాలు చేశారు కష్టపడి పనిచేసే వారు అందుకే వాళ్లకు మంచి గుర్తింపు  లభించింది అని తెలిపారు.  నాని, శర్వానంద్, సందీప్ కిషన్ ఇలా చాలా మంది చాలాసార్లుమా స్టుడియోలోనే డబ్బింగ్ చెబుతూ ఉండడము మామూలే. టాలెంట్ ఉండాలే కాని సినిమాపై ప్రేమ ఉంటే తప్పకుండా సక్సెస్ ఖచ్చితముగా అవుతారు’ అని తమ్మారెడ్డి భరద్వాజ్ . తెలియచేయడం జరిగింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: