నిర్మాత దిల్ రాజ్ పవన్ కళ్యాణ్ తో ‘పింక్’ రీమేక్ మూవీని చేయబోతున్నట్లు ప్రకటించిన రెండు రోజులు గడవకుండానే రామ్ గోపాల వర్మ పవన్ కళ్యాణ్ పై ఒక సినిమా తీయబోతున్నట్లు లీకులు ఇస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. వాస్తవానికి విడుదలకు ముందు అనేక వివాదాలు సృష్టించిన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ మూవీ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ గా టైటిల్ మార్చుకుని విడుదల అయినా ఆమూవీకి కనీసపు కలక్షన్స్ కూడ దక్కకపోవడంతో వర్మ భవిష్యత్ లో ఇలాంటి రాజకీయ సెటైర్ మూవీలను తీయడు అని భావించారు అంతా.

అయితే అందరి ఊహలకు అందని విధంగా వర్మ ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఒక పూర్తి సెటైరుకల్ మూవీ తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి గతవారం విడుదలైన ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీలో పవన్ పాత్రను క్రియేట్ చేసి సెటైర్లు వేసిన ఆపాత్రను ఎవరు పట్టించుకోలేదు. 

అయితే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వర్మ ఒక పూర్తి పొలిటికల్ సెటైర్ మూవీని తీయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అన్న విషయం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. తాను తీసే పొలిటికల్ సెటైర్ మూవీల జయాపజయాలతో సంబంధం లేకుండా వర్మ ఇలాంటి సినిమాలను చాల తీస్తాను అంటూ సంకేతాలు ఇవ్వడమే కాకుండా భాగ్యనగరంలో తన సినిమాల ప్రొడక్షన్ కు సంబంధించి ఒక భారీ ఆఫీసును కూడ ఏర్పరచడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. 

వర్మ పవన్ ను టార్గెట్ చేస్తూ ఒక సినిమాను తీయబోతున్నాడు అని వార్తలు రావడంతో పవన్ అభిమానులు రెచ్చిపోతూ వర్మను టార్గెట్ చేస్తూ కామెంట్స్ కూడ పెడుతున్నారు. అంతేకాదు వర్మ చనిపోయినట్లుగా కొన్ని ఇమేజ్ లు సృష్టించి ఆ ఇమేజ్ లకు ఇరుపక్కలా దీపాలు పెడుతూ మళ్ళీ నానా హడావిడి చేస్తున్నారు. అయితే వర్మ ఇలా పవన్ ను టార్గెట్ చేస్తూ ఒక పొలిటికల్ మూవీని తీయడం వెనుక రాజకీయాలకు సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి హస్తం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: