బుల్లితెర పై హాట్ యాంకర్ గా కొనసాగుతున్న  బ్యూటీ అనసూయ ఒకపక్క సినిమాలు చేసుకుంటూ మరో పక్క యాంకరింగ్ చేస్తుంది. పెళ్ళై ఇద్దరి పిల్లలున్న కూడా ఏ మాత్రం అందం తగ్గలేదు. అలా ఇప్పుడు సినిమాల్లో కథానాయుకురాలుగా కూడా చేసింది. కానీ ఏవి సక్సెస్ అవ్వలేదని చెప్పాలి. రంగమ్మ పాత్రలో నటించిన ఈ అమ్మడు మంచి పేరును సందించుకుంది. 


ఇప్పుడు రంగమార్తాండ సినిమాలో నటిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సుమారు రెండున్నరేళ్ల విరామం తరవాత కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. మరాఠి సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే.. బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా కూడా నటిస్తున్నట్లు కృష్ణవంశీ ప్రకటించారు.

 

ఆసినిమా లో యాంకర్ నటి అనసూయ కూడా నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ డైరెక్టర్ కృష్ణవంశీ అధికారికంగా ప్రకటించారు. ‘‘సెన్సియస్ సెన్సేషన్, స్పార్క్‌లింగ్, ఆల్వేజ్ స్మైలింగ్ అమేజింగ్ అనసూయతో వర్క్ చేస్తుండటం చాలా సంతోషం. రంగమార్తండలో ఆమె స్పైసీ రోల్‌లో కనిపించనుంది’’ అని కృష్ణ వంశీ ట్వీట్ చేశారు. ఆ ఫొటో లో అనసూయ చీరలో ఆకట్టుకుంది. 

 

రంగస్థలం లో నటించిన రంగమ్మత్త పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మల్లి ఆ మేరకు పాత్ర లో నటించిన అనసూయను ఈ పాత్రలో నటించాలని అనుకున్నారు. మరి ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ చేతి లో పడిన అనసూయ.. ఈ సినిమా లో ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. అసలే స్పైసీ రోల్ అంటున్నారు. అంటే నటనలో స్పైసీనా.. అందాలు ఆరబోయడంలో స్పైసీనా చూడాలి. ఈ సినిమా  లో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా ఒక పాత్ర పోషిస్తున్నారని టాక్.ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: