వెంకటేశ్‌  వెంకీ మామ సక్సెస్‌ మీటింగ్ లో  మాట్లాడుతూ... ‘‘మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో యూనిట్‌ అంతా ఎంతో కష్టపడటంతోనే ఇంత పెద్ద సక్సెస్‌ను అందుకున్నాం. ‘వెంకీమామ’ సినిమాను బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికి మా చిత్రయూనిట్ తరపున  థ్యాంక్స్‌. మా సినిమాని  చిరంజీవిగాకి, మహేశ్‌బాబుకి కూడా చాలా బాగుందని  అభినందించారు... వారిద్దరికీ కూడా ధన్యవాదాలు’’ అని ఆయన అన్నారు.  వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా, పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా ,  కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. 

 

డి.సురేష్‌ బాబు, టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాని నిర్మించారు .   ఈ నెల 13న ఈ సినిమా  విడుదలైంది. నాగచైతన్య ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో  మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని టెన్షన్ గా ఉండేది. విడుదల తర్వాత మా అందరికి చాలా సంతోషంగా ఉంది. అందరూ సినిమాను తమదిగా భావించి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇద్దరు మామలు కలిసి కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ ఎలా ఉంటుందో నాకు చూపించారు.

 

మాకే కాదు.. ఇది తాతగారి  కల.. నిజానికి తాతగారి సక్సెస్‌. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.ఈ సినిమా ను  ‘‘నా ఫ్యామిలీతో కలిసి  చూశాను. మేము అంతా కూడా బాగా ఎంజాయ్‌ చేశారు’’ అన్నారు రాశీఖన్నా.ఇక పాయల్‌ రాజ్‌పుత్‌ ‘‘మనం రేపు మాట్లాడుకునే సినిమాల్లో ‘వెంకీమామ’ ఒకటిగా నిలుస్తుందని నేను కచ్చితంగా  చెప్పగలను’’ అన్నారు . ఈ సినిమా  ‘‘ఈ సక్సెస్‌ రెండేళ్ల కష్టం. హిట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌. నా జీవితంలో  చాలా ప్రత్యేకం. కె.ఎస్‌.రవీంద్ర మాట్లాడుతూ ... ఈ సినిమాను  వెంకటేశ్‌గారు, చైతన్యగారి పాజిటివిటీ వల్లే  తీయగలిగాను’’ అన్నారు . 

 

ఇక టీజీ విశ్వప్రసాద్‌ ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు . దీనిపై సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.తమన్‌ ‘‘వెంకటేశ్‌గారు, చైతన్యగారితో సినిమా అనగానే ఎగ్జయిట్‌ అయ్యి ‘వెంకీమామ’ చేశాను’’ అన్నారు  . ‘‘ఇంటి భోజనం తింటే ఎలా ఉంటుందో ‘వెంకీమామ’ చూస్తుంటే అలా అనిపించింది’’ అన్నారు డైరెక్టర్‌ నందినీ రెడ్డి. డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి,  చందూ మొండేటి, నిర్మాత వివేక్‌ కూచిభొట్ల, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: