ఎన్టీఆర్ ఇది ఒక పేరు కాదు ... అభిమానులకు ఓ బ్రాండ్ నేమ్. ఎన్టీఆర్ ఇప్పటి వరకు 28 సినిమాలు పూర్తి చేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విషయంలో ఎన్టీఆర్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా ఆర్ఆర్ఆర్ మీదనే దృష్టి పెట్టారు. దీనికి కారణం ఉన్నది. ఈ సినిమా తనకు అత్యంత ఇష్టమైన దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.
పైగా తన పాత్రను ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నారు రాజమౌళి. ఇక ఇదిలా ఉంటె, ఎన్టీఆర్ టాలీవుడ్ లో టాప్ హీరో అందులో నో డౌట్. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కోట్లాది రూపాయల డబ్బు సంపాదించాడు. టాప్ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. కానీ, కుటుంబం మాత్రం ఎప్పుడు దూరంగానే ఉంటోంది. నందమూరి కుటుంబం చాలా పెద్దది. అత్తలు, మామలు, చిన్నాన్నలు ఇలా ఎందరో ఉన్నారు.
కానీ, ఎన్టీఆర్ ను మాత్రం దూరం పెట్టారు. కారణం ఏంటి అన్నది అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ మొదటి భార్య పెద్ద కొడుకు నందమూరి జయరాం మరణం తరువాత కళ్యాణ్, ఎన్టీఆర్ లు కలిసిపోయారు. హరికృష్ణ ఇద్దరు కలిసి ఉండాలని, ఎప్పటికి విడిపోవద్దని అన్నారు. అందుకే ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసుకుంటున్నారు. తమ్ముడిని హీరోగా పెట్టి అన్న కళ్యాణ్ రామ్ జైలవకుశ సినిమా తీశాడు.
ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత హ్యాపీగా సాగుతున్న లైఫ్ లో తండ్రి మరణం ఎన్టీఆర్ కుటుంబాన్ని కలిచి వేసింది. హరికృష్ణ రోడ్డుప్రమాదంలో మరణించిన తరువాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఒంటరి అయ్యారు. ఇద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. అటు బాలకృష్ణ అప్పుడప్పుడు పలకరిస్తున్నారు తప్పించి ఎన్టీఆర్ కు సపోర్ట్ చేయడం లేదు అన్నది వాస్తవం. బాలయ్యగాని, చంద్రబాబు నాయుడు గాని ఎన్టీఆర్ కుటుంబాన్ని దూరం పెట్టారు. కారణం రాజకీయాలే అని అంటున్నారు సినీ విశ్లేషకులు.