టాలీవుడ్ లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న హీరోయిన్లలో ఒకరు రాశి ఖన్నా.  ప్రతి ఏడాది కనీసం ఆరు సినిమాలు తక్కువ కాకుండా సినిమాలు చేస్తూ వాటిల్లో కనీసం ఒకటి రెండు హిట్ అయ్యేలా చూసుకుంటోంది.  మినిమమ్ గ్యాంరేంటి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రాశిఖన్నా.. స్టార్ హీరోలలో ఎన్టీఆర్ తో నటించి మెప్పించింది.  కాగా, ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ వెంకిమామ సినిమాలో చైతూకు జోడిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది.  


వెంకిమామ హిట్ కావడంతో రాశిఖన్నా లక్కీ స్టార్ గా మారిపోయింది.  గతంలో హీరో సాయి ధరమ్ తేజ్ వరసగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బందులు పడుతుంటే తేజ్ తో కలిసి సుప్రీం సినిమా చేసింది.  ఈ సినిమా మంచి విజయం సాధించింది.  దీని తరువాత మరలా తేజ్ వెనకబడ్డాడు.  చిత్రలహరి సినిమా మంచి విజయం అందుకుంది.  చిత్రలహరి సినిమా విజయం తరువాత కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.  


ఎట్టిపరిస్థితుల్లో కూడా మొహమాటానికి వెళ్లి సినిమాలు ఒప్పుకోకుండా కంటెంట్ నచ్చితేనే సినిమాలు చేయడానికి సిద్ధంగా అవుతున్నాడు ఈ మెగాహీరో.  ఈ హీరో ఇప్పుడు రాశిఖన్నాతో కలిసి ప్రతిరోజూ పండగే సినిమా చేస్తున్నారు.  మారుతీ దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.  మారుతీ దర్శకత్వం కాబట్టి సినిమా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  సినిమాపై అంచనాలు ఉన్నాయి.  


గతంలో భలేభలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలు చేశారు.  ఈ రెండు మంచి విజయాలు సాధించాయి.  తరువాత మరలా మారుతి ఆ స్థాయి సినిమా చేయలేదు.  ఇన్నాళ్ల తరువాత మరలా మారుతి ప్రతి రోజుపండుగే సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈ సినిమా డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  సుప్రీమ్ సినిమా మంచి విజయం సాధించడంతో వీరి కాంబినేషన్లో వస్తున్న ప్రతి రోజు పండుగే సినిమా కూడా విజయం సాధిస్తుందని అంటున్నారు.  మరి వీరి అంచనాలు నిజమౌతాయా చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: