వరస పరాజయాలతో సతమతమైపోతున్న అఖిల్ లేటెస్ట్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావలసి ఉన్నా ఈ మూవీ హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే చాల బిజీ హీరోయిన్ గా మారిపోవడంతో ఆమె ఇచ్చిన డేట్స్ ను బట్టి ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉండటంతో ఈ మూవీ షూటింగ్ చాల ఆలస్యంగా జరుగుతోంది. 

అఖిల్ కు అక్కినేని కుటుంబ వారసత్వం ఉన్నా ఈ సినిమా కూడ ఫెయిల్ అయితే అఖిల్ కెరియర్ నిలదొక్కుకోవడం ఇక సాధ్యం కాని పని. దీనితో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలోను చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమాకు సంబంధించి ఒక సెంటిమెంట్ ను కూడ ఫాలో అవుతున్నారు. సమంత ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమాకు క్రేజ్ ఏర్పడటమే కాకుండా ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అన్న నమ్మకం ఉంది. ఈ సెంటిమెంట్ తో అఖిల్ లేటెస్ట్ మూవీలో సమంత చేత ఒక అతిథి పాత్ర చేయిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి అఖిల్ సినిమాలో అతిథి పాత్రను చేయడానికి సమంతకు అంతగా ఇష్టం లేకపోయిన అఖిల్ బలవంతంతో ఆమె ఈ పాత్రను చేయడానికి ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అయితే సమంత అతిథి పాత్రలు చేసిన సినిమాలు అన్నీ ఖచ్చితంగా హిట్ అయిన సందర్భాలు లేవు. నాగార్జున కూడ ఇలాగే సమంత సెంటిమెంట్ ను నమ్ముకుని ఆమెను ఒప్పించి ప్రత్యేక పాత్రలో ‘రాజుగారి గది 2’ చేయించాడు. ఆ సినిమా ఫెయిల్ అయింది. అయినప్పటికీ ఆమెకు ఉన్న గోల్డెన్ లెగ్ ఇమేజ్ రీత్యా తన వదిన సెంటిమెంట్ ఎదో విధంగా తనకు హిట్ ఇస్తుదన్న ఆశతో అఖిల్ చేస్తున్న ఈప్రయత్నం అయినా ఫలించాలని కోరుకుందాం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: