ఈఏడాది    నందమూరి నటసింహం బాలకృష్ణ కు  అస్సలు   కలిసి రాలేదు.  ఒకటి  కాదు  రెండు  కాదు   మూడు  భారీ డిజాస్టర్లు  ఆయన  కెరీర్ ను   ప్రభావితం చేశాయి.  ఇంతకుముందు  బాలయ్య తో సినిమా చేస్తే  మినిమం గ్యారెంటీ  అనుకున్న  నిర్మాతలు  ఇప్పుడు  ఆయన  సంప్రదించే సాహసం చేయలేకపోతున్నారు.  ఇక  ఈఏడాది  సంక్రాంతికి  బాలకృష్ణ , ఎన్టీఆర్  కథానాయకుడు  తో   ప్రేక్షకులముందుకు వచ్చాడు.   తన  తండ్రి  ఎన్టీఆర్  బయోపిక్ లో  భాగంగా  వస్తున్న మొదటి  భాగం కావడంతో   సినిమాపై విపరీతమైన  అంచనాలు ఏర్పడ్డాయి.  దాంతో  ప్రీ రిలీజ్ బిజినెస్  కూడా ఊహించని రీతిలో జరిగింది. అయితే   మొదటి షో నుండే సినిమాకు  డిజాస్టర్  టాక్  రావడం తో   బయ్యర్లకు  భారీ నష్టాలను   మిగిల్చింది.   ఇక  మొదటి భాగం  నష్టాలను  రెండో భాగం ...  ఎన్టీఆర్ మహానాయకుడుతో కవర్ చేద్దాం అనుకున్నాడు బాలకృష్ణ  కానీ  ఈ భాగం కూడా  ఎన్టీఆర్ కథానాయకుడు  లాగే భారీ డిజాస్టర్  అయ్యింది.  మొదటి భాగానికి  ఓపెనింగ్స్ అయినా వచ్చాయి  కానీ మహానాయకుడు  పబ్లిసిటీ  ఖర్చులను కూడా రాబట్టలేకపోయింది. 

 
ఈసినిమాల   ఫలితం  తో  కంగుతిన్న బాలకృష్ణ  కొన్ని నెలలు  గ్యాప్ ఇచ్చి తనకు జై సింహ  లాంటి  డీసెంట్ హిట్ ఇచ్చిన  తమిళ సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ తో  రెండో చిత్రానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా వీరిద్దరి  కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ  రూలర్. ఎలాంటి అంచనాలు లేకుండా  ఈశుక్రవారం విడుదలైన ఈ చిత్రం  పూర్ రేటింగ్స్ ను రాబట్టుకొని  మొదటి  రోజు 4కోట్ల షేర్ ను రాబట్టింది.  ఇక   రెండో రోజైతే  కోటి రూపాయల షేర్ ను   కూడా రాబట్టలేక  చేతులెత్తేసింది. దాంతో  ఈ చిత్రం  కూడా  బాలకృష్ణ  కెరీర్ లో  మరో  భారీ డిజాస్టర్ సినిమా గా మిగిలిపోయింది. అలా ఒకే ఏడాది  మూడు సినిమాలు  బాలయ్య కు  భారీ షాక్ ఇచ్చాయి.  ఇక ప్రస్తుతం  బాలయ్య , మాస్ డైరెక్టర్  బోయపాటి శ్రీను  డైరెక్షన్ లో మూడో సారి నటించడానికి రెడీ అవుతున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన  సింహ , లెజెండ్ బ్లాక్ బాస్టర్ హిట్లు  కావడంతో  ఈకాంబినేషన్ పై  కొద్దో గొప్పో అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: