సినీ తారలు చాలా మంది మద్యాన్ని సేవిస్తూ ఉంటారు.. ఇంకా దుమపానం కూడా చేస్తూ ఉంటారు.. అలాంటి వారు ఇంకా చెప్పాలంటే అన్ని వ్యసనాలకు కూడా బానిసలుగా మారి ఉంటారు.. అందుకే చాలా మంది హీరోయిన్లు పబ్ లలో తప్ప తాగి రోడ్ల మీదనో లేక ఈ యాక్సిడెంట్స్ కేసులోనూ దొరుకుతారు.. అలా ఫేమస్ అవుతుంటారు కూడా.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు దొరికారు కూడా...


అసలు విషయానికొస్తే..తమిళ బ్యూటీ సోనా ఒకప్పుడు మద్యానికి విపరీతంగా బానిస అయ్యిన ఈ అమ్మడు తాజాగా మద్యాన్ని మానేసానని అంటున్నారు.శృంగార తారగా ముద్ర వేసుకున్న ఈ భామ తమిళంతో పాటు పలు భాషల్లో నటించింది. తమిళంలో కుశేలన్‌ షాజహాన్, గురు ఎన్‌ఆళు వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. చివరిగా గత ఏడాది ప్రశాంత్‌ హీరోగా నటించిన జానీ చిత్రంలో కనిపించింది...

 

పచ్చి తాగుబోతుల మారిన ఈ అమ్మడు.. శృంగార క్రీడకు కూడా బాగానే చేస్తూ వచ్చింది..అందుకే చాలా మంది కుర్రాళ్ళు. ఈ అమ్మడు లైకులు, షేర్లు చేస్తూ పాలో అయ్యేవారు.. ఇక పోతే ఆ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చిన ఈ ఆమ్మడు ఆ తర్వాత సినిమాలలో ఎక్కడ కనిపించలేదు..దాంతో అందరూ ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పారని అంటున్నారు.. 

 

తాజాగా ఈ విషయం పై ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది.. కొందరు తన గురించి నిరాధార ప్రచారం చేస్తున్నారని, తాను సినిమాల్లో నటించడం లేదనీ, ఎక్కడికో వెళ్లిపోయాను అనీ ప్రచారం చేస్తున్నారని వాపోయింది. నిజానికి తాను ఎక్కడికీ వెళ్లలేదని, నటనకూ దూరం కాలేదని వివరించింది. ఈ ఏడాది నాలుగైదు చిత్రాల్లో నటించానని, 12 చిత్రాలను నిరాకరించినట్లు చెప్పింది. జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నానని చెప్పింది.డబ్బు మీద మోజు లేదని వెల్లడించింది. అంతేకాకుండా మద్యపానం మానేశానని చెప్పింది. ఈ ఏడాదిలో తాను ఛేజింగ్, పరమ పదం విళైయాట్టు, అసాల్ట్, తేడుదల్, పచ్చమాంగా తదితర చిత్రాల్లో నటించానని, నూతన సంవత్సరంలో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని సోనా ఆశలు పెట్టుకుంది.. మరి ఈ అమ్మడు అశలు నెరవేరుతాయి లేదా చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: