జాఫర్.. ఈ పేరు న్యూస్ ఛానళ్లను ఫాలో అయ్యేవాళ్లకు కొత్తేమీ కాదు.. పొలిటకల్ లీడర్లను రొటీన్ గా కాకుండా కాస్త స్పైసీగా ఇంటర్వ్యూ చేయడం జాఫర్ ప్రత్యేకత. టీవీ9 ద్వారా బాగా హైలెట్ అయిన ఈ రిపోర్టర్ జాఫర్.. ఆ తర్వాత బిగ్ బాస్ లోనూ పాల్గొనడంతో బాగా ఫేమస్ అయ్యాడు.

 

ఇక హైపర్ ఆది సంగతి చెప్పేదేముంది.. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. పంచ్ లకు మారు పేరుగా నిలిచాడు. అయితే గతంలో ఈ ఆది.. సినీ క్రిటిక్ కత్తి మహేశ్ ను తన స్కిట్ లో బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు.  

 

తాజాగా ఈ కామెంట్ల గురించి రిపోర్టర్ జాఫర్.. ఆదిని కడిగిపారేశారు.. అలాంటి బాడీ షేమింగ్ కామెంట్లు చేయడానికి నీకు సిగ్గుందా అని నిలదీశాడు. అది కూడా నటి, ఎమ్మెల్యే రోజా పక్కన ఉండగానే.. అసలు ఇదంతా.. ఎక్కడ జరిగిందంటారా..  న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్‌లో భాగంగా మల్లెమాల ప్రొడక్షన్స్ వారు ఈటీవీలో ‘ఆడవారి పార్టీలకి అర్ధాలే వేరులే’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 

ఈ ప్రోగ్రామ్ డిసెంబర్ 31 రాత్రి 9.30 గంటలకు ప్రసారం కాబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి వరుస ప్రోమోలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రెండు ప్రోమోలు వదలారు. రీసెంట్ గా మూడో ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలోనే ఈ సీరియస్ సీన్ ఉంది.

 

ఈ ఈవెంట్‌లో జాఫర్ ఎంట్రీ ఇచ్చి.. ఆదిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ‘కత్తి మహేష్ అనే వ్యక్తి గురించి బాడీ షేమింగ్ చేశారు.. మీకసలు సిగ్గుందా?’ అని ప్రశ్నించాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత జాఫర్ ప్రశ్నకు హైపర్ ఆది క్లారిటీ ఇచ్చినట్టున్నారు. మరి ఇంతకీ ఆది ఏం వివరణ ఇచ్చారు. కత్తి మహేశ్ పై స్కిట్ గురించి ఎలా సమర్థించుకున్నారో చూడాలంటే డిసెంబర్ 31 వరకూ వెయిట్ చేయక తప్పదుగా.

మరింత సమాచారం తెలుసుకోండి: