‘అర్జున్ రెడ్డి’ సూపర్ సక్సస్ తో ఒకేసారి క్రేజీ డైరెక్టర్ గా మారిన సందీప్ వంగ తెలుగులో చాలామంది టాప్ హీరోలను తన కథలతో సంప్రదించాడు. అయితే వారెవ్వరూ పెద్దగా స్పందించక పోవడంతో ‘అర్జున్ రెడ్డి’ మూవీని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసి ఏకంగా 275 కోట్ల కలక్షన్స్ ను రాబట్టడంతో ఒకేసారి బాలీవుడ్ సెలెబ్రెటీల దృష్టి సందీప్ వంగా పై పడింది.

దీనితో ఈ తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ సినిమాల చిరునామాగా మారిపోతాడు అని భావించారు అంతా. బాలీవుడ్ టాప్ హీరో రణబీర్ కపూర్ తో సందీప్ వంగా ‘డెవిల్’ అనే మూవీ తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ మూవీని బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ నిర్మించడానికి ముందుకు రావడంతో ఈ మూవీతో సందీప్ వంగా కెరియర్ మరింత పెరిగి పోతుందని భావించారు. 

అయితే ఇప్పుడు ఆ మూవీ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో షాక్ అయిన సందీప్ రెడ్డి టి సిరీస్ యాజమాన్యం సహకారంతో ఇప్పుడు తన ‘డెవిల్’  ను ప్రభాస్ వైపు మళ్ళించినట్లు వార్తలు వస్తున్నాయి. క్రైమ్ డ్రామాగా అల్లబడ్డ ఈ కథను ఈ మధ్యనే సందీప్ వంగ ప్రభాస్ ను కలిసి వినిపించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈకథ ప్రభాస్ పూర్తిగా నచ్చినప్పటికీ ఈ మూవీని హోల్డ్ లో పెట్టి ప్రభాస్ కొన్ని కండిషన్స్ పెట్టినట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీని టి సిరీస్ సంస్థ తన యువీ క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి సంయుక్తంగా నిర్మించాలని ప్రభాస్ సూచన ప్రాయంగా చెపుతూ తన మనసులోని మాటను బయట పెట్టినట్లు టాక్. దీనితో టి సిరీస్ సంస్థ ప్రభాస్ సూచనలకు ఆలోచనలలో పడినట్లు తెలుస్తోంది. దీనితో సందీప్ రెడ్డి ‘డెవిల్’ మాయలో ప్రభాస్ పడ్డాడా లేదా అనే విషయం తెలియడానికి మరికొంత కాలం పట్టే ఆస్కారం ఉంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: