కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా విడుదలైన ‘మత్తు వదలరా’ మూవీకి మొదటిరోజు మొదటి షో నుండి ఓవర్సీస్ లో పాజిటివ్ టాక్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కథలోని ట్విస్ట్ లతో పాటు కామెడీ ట్రాక్ కూడ బాగా ఉండటమే కాకుండా ఈ మూవీకి సత్య కామెడీ హైలెట్ అని అంటున్నారు. 

ఈ మూవీలో హీరో ఒక విచిత్రమైన పరిస్థితులలో ఇరుక్కున్న సందర్భంలో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయని అంటున్నారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ లతో పాటు కామెడీ సీన్స్ హైలెట్ అవుతున్నాయని ఈ మూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 

సినిమా సెకండ్ హాఫ్ లో కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడంతో పాటు మారక ద్రవ్యాల వ్యాపార నేపధ్యం మాఫియా కూడ ఈ మూవీకి కథకు జోడించడంతో ఈ మూవీ కథ వర్తమాన పరిస్థితులకు దగ్గరగా ఉంది అని అంటున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ మూవీకి ట్విస్ట్ ఇచ్చి ముగింపు ఇవ్వడంతో ఆ ముగింపును చూసి ఓవర్సీస్ ప్రేక్షకులు ఆశ్చర్య పోతున్నట్లు టాక్.

మూవీ విడుదల సందర్భంగా ఈరోజు ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను క్యాన్సిల్ చేసిన రాజమౌళిమూవీ పై పెట్టిన ట్విట్ వైరల్ అవుతోంది. ‘సస్పెన్స్ థ్రిల్లర్స్ క్రైం థ్రిల్లర్స్ అందులో కామెడీ మిక్స్ అయిన సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుందని ఇంతకన్నా ఎక్కువగా చెప్పడానికి తాను భయపడుతున్నాను’ అంటూ రాజమౌళిసినిమా పై ప్రశంసలు కురిపిస్తూ ఈ మూవీ హైక్ ను పెంచడానికి తనవంతు ప్రయత్నం చేసాడు. ఈ సినిమాకు ఇప్పుడు టోటల్ పాజిటివ్ టాక్ రావడంతో దీని ప్రభావం ప్రస్తుతం కలక్షన్స్ విషయంలో నిలకడగా నిలబడి ఉన్న ‘వెంకీ మామ’ ‘ప్రతిరోజు పండగే’ పై ఎలా ఉంటుందో చూడాలి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: