తెలుగు యువ హీరో రాజ్ తరుణ్.. తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు ఆ సినిమాలు ఏవి కూడా అతనికి మంచి హిట్ని ఇవ్వలేకపోయాయి.. దీంతో కొంత గ్యాప్ తీసుకొని కథ ను ఎంచుకున్నా రాజ్ తరుణ్ ఇప్పుడు మరో సినిమా లో నటించారు. ఆ సినిమానే ఇద్దరి లోకం ఒకటే.. టైటిల్ బాగున్న కూడా ఈ హీరోకి కంటెంట్ బాగోలేదని వస్తుంది.. ఈరోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది..
ఇక ఈ సినిమా విషయానికొస్తే..ఈ సినిమాకు తెలుగు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు..కానీ రామేశ్వరం పోయిన శనేశ్వరం తప్పలేదు అన్నట్లు .. రాజ్ తరుణ్ ఫ్లాప్ ఖాతా మళ్లీ కొనసాగింది.. కొత్త ప్రేమ కథ తో వచ్చినా ఈ సినిమా క్రిస్మస్ పండుగా కానుకగా ఇవాళ రిలీజ్ అయింది.. ముందుగా జనాలా నుంచి వచ్చిన స్పందన సినిమా విడుదలయ్యాక కనుమరుగైంది..
ఫస్టాఫ్లో ఏదోలా నరకం కనపడుతున్నా.. సెకండాఫ్ లో ఏదో ఉంటుందని ఆశించిన ఒకరిద్దరు ప్రేక్షకులకు కూడా సెకండాఫ్లో సీన్లు మరింత తలనొప్పిగా మారాయి. ఇక రాజ్, సాలీనీ నాలుగైదు సార్లు లిప్కిస్లు పెట్టుకుంటారు... ఇవి కూడా పండలేదు.. చివరకు థియేటర్లో ప్రేక్షకులు ప్రతి సీన్కు మళ్లీ లిప్కిస్నా ? అని జోకులు వేసుకుంటూ నవ్వుకున్నారు..
డిజాస్టర్తో 2019కు శుభంకార్డు వేసిన రాజ్తరుణ్...
అసలే ఈ యేడాది ఇండస్ట్రీలో సక్సెస్ రేట్లు లేవు. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతల చేతిలో పడినా కూడా అతనికి హిట్ రాకపోగా సినిమా లో ముద్దులు, లిప్ లాక్ లు ఎక్కువగా ఉన్నాయంటూ కామెంట్లు కూడా అందుకుంది.. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా కూడా రాజ్ తరుణ్ ఖాతాలో ఫ్లాప్ నే మిగిల్చింది అని సినిమాను చూస్తే అర్తవుతుంది..