టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలి సినిమా చిత్రంతోనే సక్సెస్ అందుకొని గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్ కిరణ్. చిత్రం సినిమా తరువాత ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుండి ఇండస్ట్రీకి రావడం, వరుస సక్సెస్ లను సాధించటంతో ఉదయ్ కిరణ్ పేరు మారుమ్రోగిపోయింది. ఉదయ్ కిరణ్ చుట్టూ నిర్మాతలందరూ క్యూ కట్టారు. 
 
అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉదయ్ కిరణ్ ను అల్లుడిని చేసుకోవాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన చిరంజీవి కూతురుతో ఉదయ్ నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. నిశ్చితార్థం రద్దు అయిన తరువాత ఉదయ్ నటించిన చాలా సినిమాలు హిట్ కాలేదు. ఉదయ్ కిరణ్ సైన్ చేసిన కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఉదయ్ కిరణ్ సినిమాలు లేక ఖాళీ అయిపోయాడని వార్తలు కూడా వినిపించాయి. 
 
ఉదయ్ కిరణ్ కు అవకాశాలు తగ్గడానికి చిరంజీవి కారణమని వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఉదయ్ ఒక యువతిని పెళ్లి చేసుకొని పెళ్లైన కోన్ని సంవత్సరాల తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ ఆత్మహత్యకు చిరంజీవికి లింక్ ఉందని ప్రచారం జరిగింది. ఉదయ్ సోదరి శ్రీదేవి పలు సందర్భాలలో ఉదయ్ ఆత్మహత్యకు చిరంజీవికి ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగలేదు. 
 
ఉదయ్ కిరణ్ తో వియ్యాల వారి కయ్యాలు అనే సినిమాను నిర్మించిన లగడపాటి శ్రీధర్ వియ్యాల వారి కయ్యాలు సినిమా విడుదల సందర్భంలో చిరంజీవిని తాను ఉదయ్ కిరణ్ పై వస్తున్న గాసిప్స్ గురించి ప్రశ్నించానని ఆ ప్రశ్నకు చిరంజీవి వియ్యాల వారి కయ్యాలు సినిమా సూపర్ హిట్ కావాలని తాను కోరుకుంటున్నానని సినిమాకు ఆల్ ది బెస్ట్ అని చెప్పారని అన్నారు. చిరంజీవికి ఉదయ్ మరణానికి ఎలాంటి సంబంధం లేదని లగడపాటి శ్రీధర్ చెప్పారు. లగడపాటి శ్రీధర్ వ్యాఖ్యలను బట్టి ఉదయ్ కిరణ్ సినిమాలు ఫ్లాప్ కావటానికి చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: