‘సరిలేరు నీకెవ్వరు’ ఫైనల్ కాపీ రెడీ చేసే పనిలో ఇప్పుడు ఆ మూవీ టీమ్ బిజీగా ఉంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి కావడంతో దేవిశ్రీ ప్రసాద్ ఆద్వర్యంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు వేగం పుంజుకున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీని ఎడిటింగ్ టేబుల్స్ దగ్గర చూసిన వారి దగ్గర నుండి వస్తున్న లీకులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ముఖ్యంగా ఈ మూవీ పాటలలో మహేష్ డాన్స్ లు ఇరగతీసాడని తనకు డాన్స్ లు రావు అంటూ విమర్శలు చేసేవారికి సమాధానం ఇచ్చే విధంగా ఈ మూవీలో అతడి డాన్స్ లు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా తమన్నాతో ఐటమ్ సాంగ్ లో అదేవిధంగా మైండ్ బ్లాంక్ సాంగ్ లో మహేష్ వేసిన స్టెప్స్ ను చూసి అతడి విమర్శకులు కూడ ప్రశంసించడం ఖాయం అని అంటున్నారు. 

తమన్నా ఐటమ్ సాంగ్ మిలటరీ ఫేర్ వెల్ పార్టీలో వస్తుందని లీకులు వస్తున్నాయి. ఈ మూవీలో మహేష్ చేత అనీల్ రావిపూడి వేయించిన మాస్ స్టెప్స్ కు మాస్ ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయం అని అంటున్నారు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ యూరప్ వెళ్ళి అక్కడ ఉండే టాలెంటడ్ మ్యుజిషియన్స్ చేత వైలన్ టంప్లెట్ సాక్సోపోన్ క్లార్నెట్ లాంటి వాయిద్య పరికరాలతో ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ సాంగ్ ను కంపోజ్ చేయించినా ఆ పాటకు సరైన సాహిత్య పదాలు పడకపోవడంతో ఆ పాట ట్యూన్ బాగున్నప్పటికీ ఆ పాటకు రావలసినంత క్రేజ్ రాలేదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి ఉద్వేగభరితమైన పాటలకు సిరివెన్నెల చేత కానీ చంద్రబోసు చేతకానీ పాటలను వ్రాయిస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా అత్యుత్సాహంతో దేవిశ్రీ ప్రసాద్ సొంతంగా థానే ఈ పాట వ్రాయడంతో ఈ పాటకు రావలసినంత ప్రాముఖ్యత రాలేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: