సినిమాలలో అవకాశాలు ఇస్తామని రకరకాల మోసాలు చేస్తున్న వ్యక్తులకు సంబంధించిన అనేక సంఘటనలకు సంబంధించిన వార్తలు అనేకసార్లు వచ్చాయి. అయినా ఈ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా మహేష్ తన ‘సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ కోసం నిన్న హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అభిమానులను కలవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం రసాబాసగా మారడం వెనుక కొందరి మోసగాళ్ళ హస్తం ఉంది అంటూ ఇప్పుడు వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయానికి సంబంధించి వస్తున్న వార్తల ప్రకారం నిన్నటి రోజు కార్యక్రమంలో మహేష్ బాబుతో ఫోటో తీయించుకోవాలి అంటే 500 చెల్లించాలి అంటూ కొందరు మహేష్ అభిమాన సంఘాల పేరుతో కొందరు మాయగాళ్ళు సీన్ లోకి ఎంటర్ అయి మహేష్ అభిమానుల దగ్గర డబ్బులు చుట్టేశారు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. మరి కొందరైతే మహేష్ ని కలవడానికి క్యూలో నుంచోకుండా అడ్డదారిలో మహేష్ దగ్గరకు తీసుకు వెళతామని నమ్మించి కొంతమంది దగ్గర 1000 రూపాయలు కూడ వసూలు చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయానా ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు మహేష్ ను కలవడానికి నిన్న వెళ్ళిన చాలామంది అభిమానులకు మహేష్ దర్శనం దొరకలేదు సరిలేదు కదా చాలా మంది అభిమానుల సంఖ్య పెరిగిపోయి పరిస్థితి అదుపు తప్పడంతో తమను బౌన్సర్లు తనని తరిమేసారానీ మహేష్ అభిమానులు గగ్గోలు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

నిన్న జరిగిన ఈ సంఘటనతో ఎలర్ట్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ యూనిట్ నష్ట నివారణ చర్యలు చేపట్టి ఈరోజు మహేష్ అభిమానులు అందరికీ పాసులు ఇవ్వడమే కాకుండా నిన్నటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నష్ట నివారణ చర్యలతో మహేష్ అభిమానులకు ఏర్పడ్డ అసహనం తగ్గుతుందో లేదో చూడాలి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: