గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక కూడా పరశురామ్ ఏడాదిన్నరగా ఖాళీగా ఉండిపోయాడంటే ఆశ్చర్యమే. మహేశ్ కి కథ వినిపించాడని.. అదే తన తర్వాతి సినిమా అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ.. మహేశ్ అనిల్ రావిపూడితో సినిమా చేశాడు. వచ్చే నెల ఆ సినిమా కూడా విడుదల కాబోతోంది. అయితే పరశురామ్ తో మహేశ్ సినిమా ఉంటుందా.. లేదా అనే అనుమానాలు కూడా వచ్చేశాయి. కానీ.. ఈ సినిమాపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. తమ కాంబోలో సినిమా ఉంటుందని స్వయంగా పరశురామ్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 

 

ఇటివల మీడియాతో మాట్లాడుతూ మహేశ్ సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. మహేశ్ తో సినిమా ఉంటుందని.. నాగ చైతన్యతో సినిమా తర్వాత తమ కాంబోలో సినిమా తెరకెక్కుతుందని క్లారిటీ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య చర్చలు జరిగి సినిమా కథ కూడా ఫైనల్ అయిందని ఓ క్లారిటీ వచ్చినట్టైంది. గీత గోవిందం తర్వాత పరశురామ్.. మహేశ్, బన్నీ, ప్రభాస్ లకు కథలు వినిపించాడని ఇందులో మహేశ్ తో మొదటగా సినిమా ఉండబోతోందని వార్తలు షికారు చేశాయి. కానీ ఆ కాంబో కాదు కదా.. బన్నీ, ప్రభాస్ లతో సినిమా కూడా కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం పరశురామ్ యువ సామ్రాట్ నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నాడు.

 

 

ప్రస్తుతం మహేశ్ సరిలేరు.. తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాడని ఫిలింనగర్ సమాచారం. ఆ లెక్కన పరశురామ్.. మహేశ్ ఇద్దరూ తమ నెక్స్ట్ కమిట్ మెంట్స్ పూర్తయ్యాక పరశురామ్ చెప్పినట్టు వీరిద్దరి కాంబోలో సినిమా ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. మహేశ్ – పరశురామ్ కాంబో సినిమాపై అభిమానులు కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: