యంగ్ హీరో నితిన్ , ఛలో ఫేమ్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రోమ్ లో జరుగుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో అక్కడ లీడ్ పెయిర్ పై సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రం లోని మొదటి సాంగ్ ను రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ఈ చిత్రం విడుదలకానుంది. ఈచిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
భీష్మ తో పాటు ఈరెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలోనే విడుదలకానున్నాయి. మరి ఇటీవల వరస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సాదిస్తాడో లేదో చూడాలి.