యంగ్ హీరో నితిన్ , ఛలో ఫేమ్  వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం  భీష్మ.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  రోమ్ లో  జరుగుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్  మాస్టర్  ఆధ్వర్యంలో  అక్కడ లీడ్ పెయిర్ పై  సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.  ఇక ఈ చిత్రం లోని మొదటి సాంగ్ ను  రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం  లో  కన్నడ  బ్యూటీ  రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం  అందిస్తున్నాడు.   ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ  సితార ఎంటర్ టైన్మెంట్స్  నిర్మిస్తున్న ఈ చిత్రం  వచ్చే ఏడాది  ఫిబ్రవరి 21న  ఈ చిత్రం విడుదలకానుంది. ఈచిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 
 
ఇక నితిన్ ఈ చిత్రంతో పాటు  మరో రెండు సినిమాల్లో నటిస్తూ  ఫుల్  బిజీ గా వున్నాడు.  అందులో  తొలిప్రేమ ఫేమ్  వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'రంగ్ దే'  ఒకటి.  ఈ చిత్రంలో  నితిన్ సరసన కీర్తి సురేష్  హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.   ఆలాగే సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి  డైరెక్షన్ లో కూడా నితిన్  ఓ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ  చిత్రంలో  నితిన్ కు జోడిగా  రకుల్ ప్రీత్ సింగ్ , మలయాళ బ్యూటీ  ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.  భవ్య క్రియేషన్స్  పతాకంపై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నాడు.
 
 
భీష్మ తో పాటు  ఈరెండు సినిమాలు కూడా  వచ్చే ఏడాదిలోనే విడుదలకానున్నాయి. మరి ఇటీవల వరస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్  ఈ మూడు సినిమాలతో  హ్యాట్రిక్ విజయాలను సాదిస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: