సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి కొన్ని కాంబినేషన్లు రాబోయే సినిమాపై అంచనాలు పెంచేస్తాయి. హీరో, దర్శకుడు కాంబో అనగానే హీరో క్యారెక్టర్, భారీ ఫైట్లు, యాక్షన్ సీక్వెన్సెస్, సాంగ్స్.. ఇలా ఒక్కో విభాగం గురించి ఊహలు కోటలు దాటేస్తూంటాయి అభిమానులకు, ప్రేక్షకులకు. అలాంటి వార్తే ఒకటి రెండు రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఓ సినిమా ఫైనల్ అయిందనే వార్త ఇండస్ట్రీలోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయిపోయింది.

 

 

ఇంకేముంది.. అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. రికార్డులు బద్దలు ఖాయం.. అంటూ ఒకటే వార్తలు హల్ చల్ చేశాయి. బాహుబలితో ప్రభాస్, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తో సందీప్.. ఇండియా వైడ్ గా ఫేమస్ అయిపోవటమే ఇంత హైప్ కు కారణం. కానీ.. ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న సమచారం ప్రకారం ఇది ఫేక్ న్యూస్ అని ఫిలింనగర్ లో రౌండ్ అవుతోంది. నిజానికి ఇటువంటి ప్రపోజల్ ఏదీ వీరిద్దరి మధ్య జరగలేదనేది ఈ వార్తలోని సారాంశం. మైత్రీ మూవీస్, బాలీవుడ్ దిగ్గజం టీ-సిరీస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయని కూడా వార్తలు జోరుగా షికారు చేశాయి. అయితే.. ఇందులో వాస్తవం లేదంటున్నాయి సినీ వర్గాలు.

 

 

ఈ సినిమాకు డెవిల్ అనే పేరు అనుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా లో స్పేస్ లో జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ఉండొచ్చు అనే వార్తలు కూడా ఇంతవరకూ బయటకి రాలేదు. ఈ సమయంలో ఇటువంటి వార్త నిజం కాదని అంటున్నారు. ఈ వార్తల్లో ఏది నిజం.. ఏది అబద్దమో వారే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: