మెగా హీరో సాయి తేజ్ నటించిన  లేటెస్ట్ మూవీ  ప్రతి రోజు పండగే ఇటీవల విడుదలై  అద్భుతమైన   వసూళ్లతో   బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది.  కేవలం వారం రోజుల్లోనే  బ్రేక్ ఈవెన్ ను  సాధించడంతో ఫుల్ రన్ లో ఈ చిత్రం బయ్యర్లకు  మంచి లాభాలను తీసుకురానుంది.  ముఖ్యంగా ఈ చిత్రం  నైజాం లో అదరగొడుతుంది.  7రోజుల్లో ఈ చిత్రం అక్కడ 7.25కోట్ల షేర్ ను రాబట్టి సాయి తేజ్ కెరీర్ బెస్ట్ మూవీ  గా రికార్డు సృష్టించింది. 
 
 
ప్రస్తుతం  సంక్రాంతి వరకు  బాక్సాఫీస్ వద్ద వేరే సినిమాలతో పోటీ లేకపోవడంతో  ప్రతి రోజు పండగే  ఫుల్ రన్ లో 30కోట్ల షేర్ వసూళ్లను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.  ఇక ఈ చిత్రం అటు ఓవర్సీస్ లో  కూడా  డీసెంట్ వసూళ్లను రాబడుతూ హాఫ్ మిలియన్ మార్క్ కు చేరువై  సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ సినిమాతో  ఎట్టకేలకు  సాయి తేజ్  కెరీర్ లో చాలా రోజుల తరువాత  బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. 
 
 
 మారుతి తెరకెక్కించిన   ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సీనియర్ నటులు సత్యరాజ్ , రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు.   గీతా ఆర్ట్స్ 2  బ్యానర్ పై బన్నీ వాస్  నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఇక  సాయి తేజ్  ప్రస్తుతం  నూతన దర్శకుడు  సుబ్బు డైరెక్షన్ లో  సోలో బ్రతుకే సో బెటర్ అనే  చిత్రంలో నటిస్తున్నాడు.  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  నాభ నటేష్  హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్విసిసి పతకం పై బివిఎస్ఎన్ ప్రసాద్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: